వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ లో యూఎస్ తీర్పు రిపీట్ ..ఇక్కడ నమస్తే ట్రంప్ అంటే అక్కడ బైబై ట్రంప్ అన్నారు : శివసేన

|
Google Oneindia TeluguNews

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీహార్లో అమెరికా తరహాలో నాయకత్వ మార్పు పునరావృతం కానుందని శివసేన సోమవారం తెలిపింది. బీహార్లో ఎన్డీఏ ఓడిపోతుందని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని ప్రస్తావిస్తూ అటువంటి ఫలితమే బీహార్ లోనూ వస్తుందంటూ శివసేన పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు కరోనావైరస్ మహమ్మారి మధ్య 'నమస్తే ట్రంప్' కార్యక్రమంపై శివసేన తన మౌత్ పీస్ 'సామానా'లో కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసింది.ఇప్పుడు ట్రంప్ ఓటమితో హర్షం వ్యక్తం చేస్తుంది .

బీహార్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ.. మూడంచెల రక్షణతో .. 38 జిల్లాలకు 55 కౌంటింగ్ కేంద్రాలుబీహార్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ.. మూడంచెల రక్షణతో .. 38 జిల్లాలకు 55 కౌంటింగ్ కేంద్రాలు

 ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో స్పష్టంగా ఓడిపోతుంది శివసేన

ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో స్పష్టంగా ఓడిపోతుంది శివసేన

అమెరికాలో ఇప్పటికే అధికారం మారిపోయిందని అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ఎంత హడావిడి చేసిన, డెమోక్రాట్ జోబైడెన్ విజయం సాధించారని శివసేన పేర్కొంది. అదే సమయంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో స్పష్టంగా ఓడిపోతుంది అంటూ శివసేన పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ భారత దేశాన్ని సందర్శించిన సమయంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడిన శివసేన , భారతదేశంలో నమస్తే ట్రంప్ అంటే అమెరికన్ ప్రజలు మాత్రం బై బై ట్రంప్ అన్నారంటూ పేర్కొంది.

 యువనేత తేజశ్వి యాదవ్ ముందు నిలబడలేరన్న శివసేన

యువనేత తేజశ్వి యాదవ్ ముందు నిలబడలేరన్న శివసేన

ట్రంప్ ను గెలిపించిన ప్రజలు ఈసారి తమ తమ తప్పును సరిదిద్దుకున్నారని శివసేన తెలిపింది. అదేవిధంగా, మోడీ, నితీష్ కుమార్ వంటి నాయకులు ఈసారి యువనేత తేజశ్వి యాదవ్ ముందు నిలబడలేరని శివసేన పేర్కొంది . భారతీయ జనతా పార్టీ మరియు దానితో పొత్తు పెట్టుకున్న పార్టీలపై మండిపడింది. బీహార్ ఎన్నికలను ప్రజలు తమ చేతుల్లోకి తీసుకున్నారని ప్రధాని మోడీ, నితీష్ కుమార్ ముందు వారు మోకరిల్లలేదని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది.

జంగిల్ రాజా అయినా పర్వాలేదు .. ముందు మీరు వెళ్ళండి

జంగిల్ రాజా అయినా పర్వాలేదు .. ముందు మీరు వెళ్ళండి

బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి తేజస్వి యాదవ్ ను జంగిల్ రాజా అంటూ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో జంగిల్ రాజ్ వ్యాఖ్యలను గురించి శివసేన మాట్లాడుతూ, బీహార్ లోని ప్రజలు ముందు మీరు వెళ్ళండి, మేము జంగిల్ రాజు వచ్చినా భరించగలము అని చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . బీహార్ మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రజలను ప్రశంసించారు శివసేన నేతలు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మనం తప్ప ప్రత్యామ్నాయం లేదని భ్రమ పడుతున్న వారి భ్రమలను తొలగించడం కోసం ప్రజలు చేయాలి పనిచేయాల్సి ఉంది అంటూ పేర్కొంది శివసేన. డోనాల్డ్ ట్రంప్ కమల హ్యారీస్ విజయాన్ని అంగీకరించలేదని, అలాంటి వ్యక్తికి మోడీ మద్దతు ఇచ్చారంటూ శివసేన ప్రధాని నరేంద్ర మోడీ పై విరుచుకుపడింది.

English summary
Shiv Sena said the power had already changed in America, and that the incumbency in Bihar had also reached the bottom. "In the Bihar assembly elections, the National Democratic Alliance led by Nitish Kumar is clearly losing. There is no alternative in the country and the state except us -- people have to do the work of removing the leaders from this illusion," the party added, calling Trump's allegations of election fraud "ridiculous".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X