వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో మరిన్ని దాడులు..ఈ సారి ఉగ్రవాదులు ఎలా దాడి చేస్తారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత మళ్లీ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున దాడులకు తెగబడేందుకు వ్యూహాలు రచిస్తున్నారా..? పుల్వామాలో ఓ కారులో పేలుడు పదార్థాలతో జవాన్ల కాన్వాయ్‌పై దూసుకెళ్లిన ఉగ్రవాది... ఈ సారి భారత్‌లో ఎలాంటి దాడులు చేయనున్నారు..? నేవీ అధిపతి సునిల్ లాంబా చెబుతున్నదేమిటి..?

Reports of terrorists being trained to carry out ops through sea: Navy chief

పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిపిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దారుణాన్ని మరవకముందే ఉగ్రవాదులు మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులు కూడా సముద్రమార్గం నుంచి జరుగుతాయని ఇందుకోసం కొందరిని ఉగ్రవాదులు తయారు చేస్తున్నారనే సమాచారం తమ వద్ద ఉందని నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు. ఇండో పసఫిక్ నిపుణుల సమావేశంలో ప్రసంగించిన సునీల్ లాంబా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఉగ్రవాదులు పలు రూపకాల్లో దాడులు చేయనున్నారనే స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉందని ఈసారి సముద్రమార్గం నుంచి ఈ దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

మిగ్-21 వర్సెస్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌: రష్యా నిపుణుడు చెబుతున్నదేంటి..?మిగ్-21 వర్సెస్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌: రష్యా నిపుణుడు చెబుతున్నదేంటి..?

ఇక 26/11 ముంబైలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సముద్రమార్గాన్ని ఎంచుకున్నారు. భారత్‌కు చెందిన మత్స్యకారుల పడవను హైజాక్ చేసి ముంబైకి చేరుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని నేవీ ఛీఫ్ గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారని చెప్పిన సునీల్ లాంబా... కొన్ని దేశాలు మాత్రం ఈ దాడులను ఖండించటం లేదని చెప్పారు. మూడువారాల క్రితం పుల్వామాలో జరిగిన దాడులు కూడా కొత్త తరహా దాడులుగానే అభివర్ణించిన నేవీ ఛీఫ్... హింసను వేర్పాటు వాదులు సృష్టిస్తే ఆ హింసకు మద్దతుగా మరో దేశం నిలిచిందంటూ పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

English summary
Weeks after the Pulwama attack, Navy Chief Admiral Sunil Lanba on Tuesday warned that there are reports about terrorists being trained to carry out operations through the sea. Addressing a gathering of global experts at the Indo-Pacific Regional Dialogue here, Lanba said the Pulwama attack was perpetrated by extremists that were "aided by a State" that seeks to destabilise India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X