బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పేలుడు, రీసెర్చర్ మృతి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జరిగిన సిలిండర్ పేలుడులో ఓ రీసెర్చర్ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఇనిస్టిట్యూట్లో ఉన్న ఏరో స్పేస్ ల్యాబ్లో ఈ పేలుడు చోటు చేసుకుంది.
ల్యాబ్లో హైడ్రోజన్ సిలిండర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 2.20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఓ రీసెర్చర్ మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఐఐఎస్సీకి అనుబంధంగా పనిచేస్తున్న సూపర్వేవ్ టెక్నాలజీ ప్రయివేటు లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన రీసెర్చర్లు ఏరో స్పేస్ ల్యాబ్లో పని చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది.
మధ్యాహ్నం గం.2.20 నిమిషాలకు ఈ పేలుడు సంభవించిందని, దీని ధాటికి ఈ రీసెర్చర్ 20 అడుగుల దూరంలో పడి చనిపోయాడని, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక్కడ ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.