వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ గాంధీ కరెప్షన్ నంబర్ 1 అన్న మోడీ ...తప్పు పట్టిన బీజేపీ సీనియర్ నేత

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి హోరా హోరీగా పోరు జరుగుతుంది. మాటల యుద్ధాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ. ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా , సోనియా గాంధీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. . మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దేశ ప్రధానిగా సమున్నత స్థానంలో పని చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపాటుకు గురయ్యింది.

మోడీ అన్నారు ఆమెకు అహంకారం .. బాబు చెప్పారు ఆమె బెంగాల్ టైగర్మోడీ అన్నారు ఆమెకు అహంకారం .. బాబు చెప్పారు ఆమె బెంగాల్ టైగర్

రాజీవ్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలని కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస ప్రసాద్ ఖండించారు. రాజీవ్ గాంధీ కరెప్షన్ కారణంగా చనిపోలేదని, శ్రీలంకకు చెందిన ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దాడిలో ఆయన చనిపోయారని పేర్కొన్నారు. మోడీ చెప్పిన విషయం ఎవరూ నమ్మరని ఆయన అన్నారు.

Respect PM But Not His Remarks on Rajiv Gandhi.. BJP Leader Reacts on Modis Corrupt No.1 Jibe

ఇక బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస ప్రసాద్ ఈ విషయంపై స్పందిస్తూ ''రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ చంపేసింది. అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదు. ఇటువంటి ఆరోపణలను ఎవరూ విశ్వసించరు. చివరికి నేను కూడా నమ్మను. మోదీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అయితే, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు'' అని బీజేపీనేత శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు.రాజకీయ ఉద్దండుడైన వాజ్‌పేయి లాంటి వారే రాజీవ్‌ గురించి గొప్పగా చెప్పారని ప్రసాద్ గుర్తు చేశారు. రాజీవ్ చాలా చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారంటూ కొనియాడారు.

English summary
Former minister Srinivasa Prasad said Rajiv Gandhi, who was described by PM Modi as 'Corrupt No.1', had been assassinated and not passed away due to corruption allegations.A Karnataka BJP leader said that even though he respected Narendra Modi, he did not agree with the PM’s recent remarks targeting Rajiv Gandhi.“The LTTE (Liberation Tigers of Tamil Eelam) planned and assassinated Rajiv Gandhi,” ANI quoted former Union minister Srinivasa Prasad as saying. “He did not die due to corruption allegations. Nobody believes that, even I don't believe it. I have a lot of respect for Modi ji, but it was not necessary for him to speak against Rajiv Gandhi.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X