ఢిల్లీలో ఘర్షణ వాతారణం: శాంతిభద్రతలు నెలకొల్పాలంటూ అమిత్ షాకు అరవింద్ కేజ్రీవాల్ వినతి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు సానుకూల, ప్రతికూల వర్గాల మధ్య చోటు చేసుకున్న అల్లర్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చి తిరిగి శాంతియువత వాతావరణాన్ని కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కోరారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, వెంటనే ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ను, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభ్యర్థించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిని క్షమించకూడదని అన్నారు.
Very distressing news regarding disturbance of peace and harmony in parts of Delhi coming in.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 24, 2020
I sincerely urge Hon’ble LG n Hon'ble Union Home Minister to restore law and order n ensure that peace and harmony is maintained. Nobody should be allowed to orchestrate flagrations.
ఉత్తర ఢిల్లీలోని భజన్పుర, మౌజపుర ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి ఇరువర్గాల మధ్య అల్లర్లు చోటు చేసుకున్నాయి. 24 గంటల్లో ఇలా ఘర్ణణ వాతావరణం ఏర్పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. సీఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ ఉద్రిక్త వాతావరణానికి తెరతీశారు.
ఈ ఘర్షణలకు సంబంధించి పలు వీడియోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఓ ఆటోరిక్షాతోపాటు మరో వాహనాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు. పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వుతుండటం గమనార్హం. కాగా, ఈ రాళ్లదాడిలో ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
Recommended Video
కబీర్నగర్లో ఇరువర్గాలవారు రాళ్లు రువ్వుకుంటున్న దృశ్యాల వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. కాగా, జఫరాబాద్ ప్రాంతంలో 10వేల మంది మహిళలు సీఏఏకు వ్యతిరేకంగా శనివారం రాత్రి నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం రాళ్లు రువ్వుకోవడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి.