7 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం, వచ్చే నెలలో తగ్గే ఛాన్స్
న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్టానికి చేరుకొంది. అక్టోబర్ నెలలో ఈ ద్రవ్యోల్బణ 3.58 శాతానికి పెరిగింది. ఈ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది. డిసెంబర్ 6న ఆర్బీఐ పాలసీ మీటింగ్ జరుగనుంది.
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి చేరుకొంది. దీని ప్రభావం ధరలపై పడనుంది. ద్రవ్యోల్బణం ఆధారంగానే ఆర్బిఐ కీలక నిర్ణయాలు తీసుకొంటుంది.
7 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి చేరింది. ఆహార, ఇంధన ధరలు బాగా పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినట్టు వెల్లడైంది.వినియోగదారుల ధరల సూచీ ద్వారా ఈ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రేట్ల కోతకు రిటైల్ ద్రవ్యోల్బణం ముఖ్యమైనది. ఈ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది. డిసెంబర్ 6న ఆర్బీఐ పాలసీ మీటింగ్ జరుగనుంది.
వచ్చే నెలలో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం
రెండు
రోజుల
క్రితం
జిఎస్టీ
కౌన్సిల్
178
ఉత్పత్తుల
ధరలను
28
శాతం
నుంచి
18
శాతం
తగ్గిస్తూ
నిర్ణయం
తీసుకొంది.
దీని
కారణంగా
వచ్చే
నెలల్లో
ఈ
రిటైల్
ద్రవ్యోల్బణం
స్వల్పంగా
తగ్గే
అవకాశాలున్నాయని
పలువురు
విశ్లేషకులు
అంచనావేస్తున్నారు.
జూన్ నుండి పెరుగుతున్న ద్రవ్యోల్బణం
ఈ
ఏడాది
జూన్
నుండి
రిటైల్
ద్రవ్యోల్బణం
క్రమంగా
పెరుగుతూ
వస్తోంది.
అదేవిధంగా
హౌజింగ్
ద్రవ్యోల్బణం
స్వల్పంగా
పెరిగింది.
సెప్టెంబర్లో
6.1
శాతంగా
ఉన్న
హౌసింగ్
ద్రవ్యోల్బణం
6.68
శాతానికి
ఎగిసింది.
అంచనావేసిన
దానికంటే
స్వల్పంగా
వార్షిక
పారిశ్రామికోత్పత్తి
పెరిగింది.
పారిశ్రామిక ఉత్పత్తి 4.2 శాతం పెరిగే అవకాశం
సెప్టెంబర్లో
ఈ
ఉత్పత్తి
3.8
శాతం
పెరిగినట్టు
తెలిసింది.
విశ్లేషకుల
అంచనాల
ప్రకారం
వార్షిక
పారిశ్రామికోత్పత్తి
4.2
శాతం
పెరుగుతుందని
రాయిటర్స్
పోల్లో
వెల్లడైంది.ద్రవ్యోల్బణం
ఆధారంగా
ఆర్బీఐ
వచ్చే
నెల
6వ,
తేదిన
జరిగే
సమావేశంలో
కీలక
నిర్ణయం
తీసుకొనే
అవకాశం
ఉందని
నిపుణులు
అంటున్నారు.