అయోధ్యకు లైన్ క్లియర్... రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు
అయోధ్య వివాదంలో దాఖలైన రివ్యూపిటిషన్లపై సుప్రీం కోర్టు తేల్చేసింది.. గురువారం అయోధ్య తీర్పుపై దాఖలైన మొత్తం రివ్యూపిటిషన్లపై నేడు విచారణించిన కోర్టు వాటిని కోట్టి పారేసింది. గత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్గా పేర్కోంటూ... నిర్ణయం వెలువరించింది.
అయోధ్య పై రివ్యూ పిటిషన్లను కోట్టివేసిన సుప్రీం కోర్టు
అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ధర్మాసనం తీర్పుపై పలు పలు రివ్యూ పిటిషన్లు వేశారు. దీంతో వాటిని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మొత్తం రివ్యూ పిటిషన్లు కొట్టివేసిన కోర్టు గత నెల ఇచ్చిన తీర్పు ఫైనల్ అంటూ న్యాయమూర్తులు పేర్కోన్నారు.
40కి పైగా రివ్యూ పిటిషన్లు
సుప్రీం కోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో విచారణ చేపట్టి తీర్పును వెలువరించిన అయోధ్య వివాదం కేసు మరోసారి సుప్రీం కోర్టుకు చేరిన విషయం తెలిసిందే.... తీర్పు తర్వాత రివ్యూ పిటిషన్కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ముస్లిం పర్సనల్ లాబోర్డుతో పాటు సుమారు 18 పిటిషన్లతో పాటు మొత్తం 40 మంది మంది వ్యక్తిగతంగా కూడ అయోధ్య సంబంధం లేని వారు కూడ రివ్యూ పిటీషన్లు దాఖలు చేశారు. ఇందులో అయోధ్య వివాదంపై పోరాడిన హిందూ సంస్థ అయిన నిర్మోహి అఖాడా కూడ రివ్యూ పిటిషన్ ధాఖలు చేసిన వారిలో ఉన్నారు.. వీటన్నింటిని నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.
నవంబర్ 9న అయోధ్య తీర్పు
కాగా అయోధ్య వివాదంపై నవంబర్ తొమ్మిదిన జస్టీస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం నలబై రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వెలువరించింది. భూ వివాదానికి సంబంధించి మొత్తం 2.77 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగిస్తూ.. తీర్పు వెలువరించింది. అనంతరం మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామమందిర నిర్మాణానికి పూర్తి అడ్డంకులు తొలగిపోయాయి.