మే నుండి ప్రతి రోజూ పెట్రోల్, ఢీజీల్ ధరల మార్పు, 5 మెట్రో సిటీలివే
దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరలు మారనున్నాయి.ఈ ఏడాది మే 1వ, తేది నుండి ఈ విధానం అమల్లోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త ఇంధన విధానాన్ని
న్యూఢిల్లీ: దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరలు మారనున్నాయి.ఈ ఏడాది మే 1వ, తేది నుండి ఈ విధానం అమల్లోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త ఇంధన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
దేశ వ్యాప్తంగా ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది కేంద్రం. ఈ మేరకు ఐదు నగరాలను ఎంపిక చేసింది కేంద్రం. దక్షిణాదికి చెందిన పాండిచ్చేరి , విశాఖ నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ఉదయ్ పూర్, జంషెడ్ పూర్, ఛంఢీఘడ్ ప్రాంతాల్లో ప్రతి రోజూ పెటోల్ , డీజీల్ ధరల్లో మార్పులు చేయనున్నారు.
ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర ఆధారంగా పెట్రోల్, డీజీల్ ధరలను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ప్రతి 15 రోజులకు ఓ సారి పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షంచనున్నారు.అయితే కొత్త విధానాన్ని అమలు చేయడం వల్ల ఏ రోజుకు ఆ రోజే అంతర్జాతీయ మార్కెట్ కు ధరలకు అనుగుణంగా నిర్ణయించనున్నారు.
దేశంలోని 90 శాతం ఆయిల్ రిటైల్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లు కలిగి ఉన్నాయి. ఈ మూడు సంస్థలు అమలు చేయాలనుకొన్న నగరాల్లో సుమారు 200 పెట్రోల్ బంక్ లున్నాయి.