జూన్ 28 నుంచి ప్రీడం251 ఫోన్ల డెలివరీ: రింగింగ్ బెల్స్
ముంబై: రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ జూన్ 28వ తేదీ నుంచి ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని ప్రకటించింది. రూ.251 ఫోన్ అని చెప్పి రింగింగ్ బెల్స్ కొద్ది నెలల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తాము ఈ నెల 28వ తేదీ నుంచి బుకింగ్ చేసిన వారికి స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తామని సోమవారం నాడు రింగింగ్ బెల్స్ ప్రకటించింది. రూ.2,500 విలువైన స్మార్ట్ ఫోన్ను రూ.251కే స్తామని ప్రకటించింది. దీని పైన అప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
కంపెనీ పైన కేసులు నమోదయ్యాయి. అయితే, అప్పటికే ఆ సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విమర్శల నేపథ్యంలో చాలామందికి డబ్బులు వాపస్ చేసి కనుమరుగయిందనుకున్నారు. కానీ, తాము ఇప్పుడు ఆ ముప్పై వేల మందికి క్యాష్ ఆన్ డెలివరీ చేస్తామని ప్రకటించింది.
రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ జూన్ 28వ తేదీ నుంచి ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని ప్రకటించింది. రూ.251 ఫోన్ అని చెప్పి రింగింగ్ బెల్స్ కొద్ది నెలల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాము ఈ నెల 28వ తేదీ నుంచి బుకింగ్ చేసిన వారికి స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తామని సోమవారం నాడు రింగింగ్ బెల్స్ ప్రకటించింది.