వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషికపూర్ లాస్ట్ ట్వీట్: బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. వైద్య సిబ్బందిపై దాడి చేయొద్దు, వైరస్‌ను జయిద్దాం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌తో పోరాడే వారికి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. రేయనక, పగలనక పనిచేయడమే కాదు.. ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల వైద్య సిబ్బంది, పోలీసులపై కొందరు దాడి చేశారు. దీనిపై బాలీవుడ్ నటుడు రిషికపూర్ కూడా స్పందించారు. గురువారం ఉదయం ఆయన కన్నుమూయగా.. ఈ నెల 2వ తేదీన చేసిన ట్వీట్ మరోసారి వార్తల్లో నిలిచింది.

సోషల్ మీడియాలో రిషికపూర్ యాక్టివ్‌గా ఉండేవారు. వివాదాస్పదమైన పోస్టులపై కూడా తన అభిప్రాయం చెప్పేవారు. సామాజిక, రాజకీయ అంశాలపై వేగంగా స్పందించే రిషికపూర్.. ఈ నెల 2వ తేదీన కూడా ఒక పోస్ట్ చేశారు. కరోనా వైరస్‌ సందర్భంగా వైద్యం అందిస్తోన్న సిబ్బందిపై దాడి చేయడం సరికాదని ట్వీట్ చేశారు. 'సోదరి, సోదరులారా.. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అత్యవసర సేవలు అందిస్తోన్న వారిపై దాడి చేయకండి. వారు ప్రాణాలకు తెగించి పనిచేస్తే దాడి చేయడం సరికాదు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై మనం విజయం సాధించాలి. జై హింద్ అని' ట్వీట్ చేశారు.

Rishi Kapoor Last Tweet: Not be Violent Towards Medical Staff..

అదేరోజు డైరెక్టర్ కునాల్ కోహ్లీతో కూడా రిషికపూర్ చాట్ చేశారు. సినిమాలో డోలు వాయించే అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. చాలా చక్కగా వాయించారని, డోలు కాదే.. ఇతర ఏ సంగీత వాయిద్యం పట్టుకున్న అలానే అనిపిస్తోందని పేర్కొన్నారు. మీ లాంటి సృజన కలిగిన దర్శకుడికి ప్రతిభను చూపేందుకు నాకో అవకాశం వచ్చిందని అని రీ ట్వీట్ చేశారు.

Recommended Video

అబూ బకర్ పిరికివాడిలా చచ్చాడు: డేంజరస్ ఆపరేషన్ అంటూ డొనాల్డ్ ట్రంప్

English summary
Rishi Kapoor's last tweet, posted on April 2, was an appeal to refrain from violence towards doctors and nurses fighting against coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X