బిహార్ లో కుదిరిన పోత్తులు ఆర్జెడి 19, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటి
పాట్నా..గత కొద్ది రోజులుగా ఆర్జేడి ,కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోత్తుల పై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.పోటి చేసే పార్టీలు కలిసి ఓ అవగహను వచ్చినట్టు సమాచారం.ఓప్పందం ప్రకారం ఆర్జెడి 19 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో ,మిగతా 12 స్థానాల్లో ఇతర పార్టీలు పోటి చేయనున్నాయి,త్వరలోనే పార్టీల మధ్య సీట్ల పంపకం పై అధికారిక ప్రకటన చేయనున్నారు.
బిహార్ లోని మొత్తం 40 లోక్ సభ స్థానలకు గాను ఆర్జేడి 19 లోక్ సభ స్థానాల్లో పోటి చేయనుండగా కాంగ్రెస్ పార్టీ 9 సీట్లలో పోటి కి దిగేందుకు రెండు పార్టీల మధ్య ఒప్పందాలు కుదిరాయి..అయితే కాంగ్రెస్ మొదట 11 సిట్లలో పోటి చేసేందుకు సిద్దమైంది..కాని తన డిమాండ్ ను తగ్గి తోమ్మిది సీట్లలో పోటి చేసేందుకు పరిమితమైంది..దీంతో ఆ సీట్లను సిపిఐ- ఎమ్ఎల్ కు ఇచ్చేందుకు ఒప్పుకుంది. కాగా మిగిలిన వాటిలో నాలుగు స్థానాల్లో RLSP ,రెండు స్థానాల్లో HAM(S) రెండు స్థానాల్లో శారద్ యాదవ్ కు చెందిన LJD,ఒక స్థానంలో ముఖేష్ సాహానికి చెందిన వికాశీల్ ఇన్సాన్ పార్టీ పోటి చేయనున్నాయి.
కాగా జేఎన్టీయు మాజి ప్రెసిడెంట్ కన్హాయ కుమార్ కు బెగుసరాయి స్థానం నుండి పోటి చేయించాలని సిపిఐ భావించింది. అయితే ఆ సీటుకు సంభంధించి ఎలాంటి క్లారిటి రాలేదు..కాని అక్కడి నుండి సిపిఐ పోటి చేసే అవకాశం ఉంది.