వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదాలు: యూపీలో 6గురు, ఒరిస్సాలో 4గురు మృతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండు రోష్ట్రాల్లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 10మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. శనివారం బస్రత్ సింగిడి చౌక్ వద్ద ఓ కారు అదుపు తప్పి పక్కన ఉన్న వంతెనను ఢీకొట్టింది.

ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకుని పశ్చిమబెంగాల్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

యుపిలో ఆరుగురు మృతి

Road accidents: 10 killed in two states

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. లారీ-కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు వ్యక్తులకు గాయాలైయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో పల్టీలు కొట్టిన కారు లోయలో పడిపోయింది. దీంతో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతులు ఝంగ్నాపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

English summary
10 persons have died in road accidents in two states on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X