వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: నిద్రిస్తున్న కుక్కపై రోడ్డు వేశారు, తారు వేడికి తట్టుకోలేక మృతి(వీడియో)

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న కుక్క పైనుంచే ఓ రోడ్డు నిర్మాణ సంస్థ సిబ్బంది రోడ్డు వేశారు. దీంతో ఆ శునకం మృతి చెందింది. ఈ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో తారు రోడ్డు వేస్తున్నారు. రోడ్డుకు చివరన ఓ కుక్క నిద్రపోతోంది. దాన్ని అక్కడి నుంచి తరమడమో లేదా పక్కకు తీసుకెళ్లడమో చేయకుండా అలాగే పొగలుకక్కుతున్న తారును దానిమీద పోశారు. ఆ తర్వాత దాన్ని రోడ్డు రోలర్‌తో తొక్కించారు. దీంతో ఆ కుక్క ప్రాణాలు విడిచింది.

Road Built Over Dogs Body In Agra. It Was Alive, Allege Residents

ఈ మేరకు నరేశ్ పరాస్ అనే సామాజిక కార్యకర్త జంతు హింస నిరోధక చట్టం కింద పోలీస్ స్టేషన్‌లో కూడా అతను ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

కాగా, ఆ కుక్క వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో రోడ్డు వేసిన ఆర్పీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పందించిన ప్రాజెక్టు కాంట్రాక్టర్.. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

English summary
Hot coal tar was poured over the body of a dog while Agra's Fatehabad road was being constructed on Tuesday night. Residents allege the dog was alive. According to them, the animal was howling in pain but the construction workers ignored it and continued laying the road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X