వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 26 లక్షలు క్యాష్: ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లారు

|
Google Oneindia TeluguNews

జైపూర్: నగదు లూటీ చెయ్యడానికి వెళ్లిన నిందితులు వీలు కాకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ ను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీసులు నాకాబందీలో పలు వాహనాలు పరిశీలించినా నిందితుల ఆచూకి చిక్కలేదు.

జైపూర్ కు 65 కిలోమీటర్ల దూరంలోని బైన్ స్వా ప్రాంతంలో జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రం ఉంది. సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని దుండగులు ఏటీఎం కేంద్రం దగ్గరకు వెళ్లారు.

 Robbers decamp with ATM containing Rs. 26 laks in Rajasthan

తరువాత మిషన్ పగలగొట్టి నగదు లూటీ చెయ్యడానికి విఫలయత్నం చేశారు. వీలు కాకపోవడంతో ఏటీఎం యంత్రం ఎత్తుకెళ్లారు. మంగళవారం వేకువ జామున 2.30 గంటల సమయంలో విషయం గుర్తించిన సెక్యూరిటి గార్డు పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు పలు చోట్ల అనేక వాహనాలు పరిశీలించారు. అయితే ఏటీఎం మిషన్ చిక్కలేదు. ఏటీఎం మిషన్లో రూ. 26.76 లక్షలు ఉందని బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Robbers uprooted the cash dispensing machine of a nationalised bank and fled with it late last night when the guard posted at the ATM outlet was sleeping on the rooftop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X