మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా కు ఊరట .. షరతులతో కూడిన ముందస్తు బెయిల్
మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఏప్రిల్ 1న స్పెషల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన క్లయింట్పై రాజకీయ ప్రతీకారానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని వాద్రా తరఫు న్యాయవాది కేటీ తులసి కోర్టులో తమ వాదన వినిపించారు .
లండన్కు
చెందిన
1.9మిలియన్
పౌండ్ల
విలువ
గల
స్థిరాస్తి
వ్యవహారంలో
అవకతవకలకు
పాల్పడ్డారంటూ
వాద్రాపై
ఈడీ
మనీలాండరింగ్
కేసు
నమోదు
చేయడంతో
యుపిఎ
ఛైర్పర్సన్
సోనియా
గాంధీ
అల్లుడు
రాబర్ట్
వాద్రా
ఇరకాటంలో
పడ్డారు.
ముందస్తు
బెయిల్
కోసం
ఢిల్లి
కోర్టులో
పిటిషన్
దాఖలు
చేసిన
వాద్రా
పిటిషన్
ను
విచారించిన
డిల్లీ
న్యాయస్థానం
ముందస్తు
బెయిల్
మంజూరు
చేసింది.
ఫిబ్రవరి
16
వరకూ
అరెస్టు
చేయకూడదని,
తదుపరి
వాద్రానే
ఈడీ
విచారణకు
హాజరవుతారని
వాద్రా
చేసిన
పిటిషన్
కు
కోర్టు
అంగీకరించింది.
ఇదే
కేసులో
ప్రధాన
నిందితుడిగా
ఉన్న
వాద్రా
స్నేహితుడు
మనోజ్
ఆరోరా
కూడా
ఇప్పటికే
ముందస్తు
బెయిల్
పొందారు.ముందస్తు
బెయిల్
కోసం
ఇద్దరూ
5
లక్షల
పర్సనల్
బాండ్లను
సమర్పించాలని
కోర్టు
తెలిపింది.
ప్రస్తుతం
ఈ
కేసులో
ఇద్దరూ
మధ్యంతర
బెయిల్
పై
ఉన్నారు.
కోర్టు
అనుమతి
లేకుండా
దేశం
విడిచి
వెళ్లకూడదని
జడ్జి
అరవింద్
కుమార్
వాద్రాకు
సూచించారు.విచారణ
అధికారులు
ఎప్పుడు
పిలిస్తే
అప్పుడు
విచారణకు
హాజరవ్వాలని
సూచించింది.
షరతులతో
కూడిన
బెయిల్
లభించడం
ఒకరకంగా
వాద్రాకు
పెద్ద
ఊరట
గా
భావించవచ్చు.