వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ సాయంతో నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంటుపై రాకెట్లతో ఉగ్రదాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కాబుల్: ఆఫ్గన్ రాజధాని కాబూల్‌లో భారత ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నిర్మించిన పార్లమెంటు భవంతిపై సోమవారం నాడు ఉగ్రవాదులు రాకెట్ దాడి చేశారు. ఈ భవనాన్ని గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభించారు.

ఈ దాడిలో జరిగిన ప్రాణనష్టం గురించిన సమాచారం తెలియరాలేదు. తేలికపాటి రాకెట్‌ను సమీపం నుంచి పార్లమెంటు మీదికి తాలిబాన్ ఉగ్రవాదులు ప్రయోగించారని తెలుస్తోంది. పార్లమెంటును చుట్టుముట్టిన ఆఫ్గన్ భద్రతా దళాలు, మరో దాడి జరగకుండా చర్యలు చేపట్టారు. సైన్యం ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతోంది.

Rocket attack at Afghan Parliament, no casualties reported

ఆప్ఘన్ కొత్త పార్లమెంటు భవనాన్ని రూ.1000 కోట్లతో నిర్మించారు. 2007లో ప్రారంభమైన భవన నిర్మాణం 2015 చివరి నాటికి పూర్తయింది. ఈ భవనం నిర్మాణానికి ఏడేళ్ల సమయం పట్టింది. అందుకే భారత ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో ఈ పార్లమెంటు భవననాన్ని ప్రారంభింపచేశారు.

ఎగువ సభలో 192 సీట్ల సామర్థ్యం ఉండగా, దిగువ సభలో 294 మంది సభ్యులు పార్లమెంటులో కూర్చునే వీలు ఉంది. అదే సమయంలో మన దేశ సహకారంతో నిర్మింతమైన ఈ భవనానికి అటల్ బ్లాక్‌గా పేరు పెట్టడం గమనార్హం.

English summary
Rocket attack at Afghan Parliament, no casualties reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X