రోహిత్ ఆస్థుల కోసమే ఆయన భార్య చంపివేసింది, రోహిత్ తల్లి,
న్యూఢిల్లీ : ఇద్దరు కోడుకులైన సిద్దార్థ్, రోహిత్ ల ఆస్థిపై రోహిత్ భార్య ఆపూర్వ ఆమే కుటుంభ సభ్యులు కన్నేశారని, సుప్రిం కోర్టు సమీపంలో ఉన్న ఇంటిని దక్కించుకోవాలని చూశారని రోహిత్ తల్లి ఉజ్వల తివారీ ఆమే కోడలి పై ఆరోపణలు చేశారు.
ఆస్థుల కోసమే కొడుకు హత్య ,రోహిత్ తల్లి
ఆస్తుల కోసమే ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ ను ఆయన భార్య చంపి వేసిందని రోహిత్ తల్లి ఉజ్వల తివారి ఆరోపించారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం ,దివంగత నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే, ఈనేపథ్యంలోనే విచారణ చేపట్టిన ఢిల్లి పోలీసులు రోహిత్ ది హత్యేనని నిర్ధారించారు. ఈ క్రమంలోనే పోలీసులు రోహిత్ భార్యను పోలీసులు విచారిస్తున్నారు. అయితే రోహిత్ భార్య అపూర్వను విచారిస్తున్న సమయంలో ఎన్డీ తివారి భార్య ఉజ్యల తివారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెళ్లయిన మొదటి రోజు నుండే బార్య భర్తల మధ్య గొడవలు,
పెళ్లయిన మొదటి రోజు నుండే బార్య భర్తల మధ్య గొడవలు తలెత్తాయని చెప్పింది. ఈనేపథ్యంలోనే రోహిత్ ,ఆయన భార్య అపూర్వ మద్య సఖ్యత లేదని .. కాగా ఉత్తరాఖండ్ సీఎం గా ఉన్న క్రమంలో ఎన్డీ తివారికి చేదోడువాదోడుగా ఉన్న రాజీవ్ కొడుకు కార్తీక్ రాజ్ కు ఆస్తిలో వాటా ఇవ్వాలని నా పెద్ద కుమారుడు సిద్దార్థ్ భావించాడు.ఇందుకు రహిత్ సైతం సుముఖత వ్యక్తం చేశాడని తెలిపింది.అయితే అపూర్వ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. సుప్రిం కోర్టులో ఉన్న ఆస్తిని తన పేర రాయలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని , ఇందులో భాగంగానే రోహిత్ ,అపూర్వలు ఈ ఏడాది జూన్ లో విడాకులు తీసుకోవాలని పరస్పర అంగీకారం కుదుర్చుకున్నారని ఉజ్వల తెలిపింది.
కోర్టు ద్వార కోడుకు, భార్యగా అంగీకరించిన తివారీ
కాగా ఉజ్వల తివారికి మొదటి భర్త ద్వార కలిగిన సంతానం సిద్దార్థ్ కాగా ,2008 లొ తివారి తనకు జన్మనిచ్చిన తండ్రి అంటూ ఆమే రెండో కుమారు రోహిత్ శేఖర్ కోర్టులో కేసు వేశాడు, దీంతో డీఎన్ఏ పరీక్షల అనంతరం రోహిత్ తివారీ కుమారుడేనని 2012 జూలై లో లో ఢిల్లి హైకోర్టు తీర్పు చెప్పింది. తీర్పు నేపథ్యంలో 2014 మార్చిన రోహిత్ ను తివారీ తన కుమారుడిగా అంగీకరించారు. రెండు నెలల అనంతరం రోహిత్ తల్లి ఉజ్వల తివారిని వివాహం చేసుకున్నాడు ఎన్డీ తివారీ.