ఎన్డీ తివారి కోడలు, తిహార్ జైల్లో రిమాండ్ ఖైదిగా ఉన్న అపూర్వ ఏం చేస్తుందో తెలుసా...!
మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కొడుకు శేఖర్ తివారి కుమారుడి హత్య కేసులో నిందితురాలు, రిమాండ్ ఖైదిగా ఉన్న శేఖర్ భార్య అయిన అపూర్వ శుక్లా ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా... జైలు జీవితంతో భవిష్యత్ను కోల్పోయిన అపూర్వ ఇతరుల భవిష్యత్ను చదువుతోంది. అందరి ఖైదిల్లా కాకుండా తన స్వంత లాయర్ తెలివి తేటలకు పదును పెడుతోంది. ఇందుకోసం చిలక జోస్యంలాగా భవిష్యత్ను చేప్పే టారో కార్డులు చదవడంపై శిక్షణ పోందుతోంది.
రాజకీయ రంగంలో ఉన్న ఎన్డీ తివారి కొడుకు ను పెళ్లి చేసుకుని ఆ రంగంలో త్వరగా స్ధిరపడడంతో పాటు ఆర్ధికంగా కూడ బలపడవచ్చనే ఆలోచన చేసిన ఎన్డీ తివారి కోడలు అపూర్వ శుక్లా ప్రస్తుతం జైళ్లో ఉచలు లెక్కపెడుతున్న విషయం తెలిసిందే...అపూర్వ తన భర్త అయిన శేఖర్ తివారి హత్య కేసులో తిహార్ జైల్లో రిమాండ్ ఖైదిగా ఉంది. అయితే జైల్లో ఆమే ప్రత్యేకంగా జ్యోతిష్యం చెప్పే కార్డులను చదివే శిక్షణ పోందుతోంది. జైల్లో ఉన్న ఖైదీలకు వారానికి రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో ఆమే చిలుక జోస్యం మాదిరి ఉండే టారో కార్డులు చదవడంపై శిక్షణ తీసుకుంటుందని శిక్షణ ఇస్తున్న డాక్టర్ ప్రతిభా సిన్హా తెలిపారు.
కాగ ప్రతి గురు, శుక్రవారాల్లో టారో కార్డులపై రెండు గంటలపాటు శిక్షణ ఇస్తారని , ఈనేపథ్యంలోనే మొత్తం 78 కార్డులకు గాను 15 కార్డులను చదవిందని సిన్హా తెలిపారు, గత ఆరు,ఏడు సంవత్సరాలుగా టారో కార్డులను చదవాలని అనుకున్న పలు కారణాల వల్ల తీరిక దొరకలేదని అందుకే జైళ్లో అవకాశం రావడంతో వాటిని నేర్చుకుంటుందని తెలిపారు. ఏప్రిల్ 15వతేదిన మద్యం మత్తులో వచ్చి రోహిత్ శేఖర్ను ఆయన భార్య అయిన అపూర్వ దిండుతో గోంతుపై నులిమి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించింది.