రోహిత్ కు పెళ్లికి ముందే కోడుకు ఉన్నాడు, అందుకే చంపేశా : అపూర్వ
మాజి ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారి హత్య కేసులో కోత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రోహిత్ హత్య కేసులో విచారణ ఎదుర్కోంటున్న అతని భార్య అపూర్వ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రోహిత్ పెళ్లికి ముందే ఓ కొడుకు ఉన్నాడని పేర్కోంది. ఈనేపథ్యంలోనే హత్యకు కారణలు,పరిస్థితులను పోలీసులకు వివరించింది.
రోహిత్ కు పెళ్లికి ముందే అక్రమ సంబంధం
కాగ ఇద్దరి వివాహానికి ముందే రోహిత్ ఆయన దగ్గరి బంధువుతో వివాహేతర సంబంధం ఉందని వారికి ఓ కుమారుడు కూడ జన్మించాడని తెలిపింది. ఇదే విషయం తనను ఎప్పుడు బాధించేందని తెలిపింది. అయితే రోహిత్ పేరుమీద ఉన్న అస్థి ని సదరు మహిళ కోడుక్కి ఇవ్వాలని కోరేదని దీనికి తోడు రోహిత్ సైతం అబ్బాయిపై అసక్తి కనబరిచేవారని చెప్పింది.ఈనేపథ్యంలోనే రోహిత్ తో ఎప్పుడు అక్రమ సంబంధం గురించి తరచూ గొడవలు అయ్యోవని ,అయితే రోహిత్ గోడవల్లో భాగంగా తన ఎఫైర్ గురించి గోప్పగా చెప్పుకునే వారని అందుకే కోపంతో చంపివేశానని తెలిపారు.
రాజకీయాల మీద ఆసక్తితోనే రోహిత్ ను పెళ్లి చేసుకున్న
కాగా అడ్వకేట్ గా పని చేస్తున్న అపూర్వకు రాజకీయాలపై అసక్తి ఉండేదని తెలిపింది ఈనేపథ్యంలోనే రోహిత్ ప్రోఫైల్ చూసి గత సంవత్సరమే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. అయితే తమ పెళ్లి జీవీతం ఎక్కువ రోజులు నిలబడలేదని చెప్పింది మే 11 2018 వివాహం జరిగితే అదే నెల మే 29న అత్తింటిని వదిలి బయటకు వచ్చనాని అనంతరం విడాకుల నోటీసుల నోటీసు కూడ పంపానని తెలిపింది. అయితే రోహిత్ కు గుండే సంబంధించి చికిత్స చేయించుకోవడంతో మళ్లి అతనితో వివాహ బంధాన్ని కొనసాగించాలని అనుకుందని చెప్పింది. ఈనేపథ్యంలోనే రోహిత్ తల్లి బాగా వేధించేదని తెలిపింది.
రోహిత్ కు తివారి ఎలాంటీ ఆస్థులు ఇవ్వలేదు
దీనికి తోడు ఆస్థుల వివాదం కూడ ఉండడంతోపాటు రోహిత్ పేరు మీద ఎలాంటీ ఆస్థి లేదని , ఉన్న ఇళ్లు కూడ ఆయన తల్లి పేరు మీద ఉందని తెలిపింది. కాగా ఎన్డీ తివారి ఎలాంటీ ఆస్తి రోహిత్ కు ఇవ్వలేదని ఇది అపూర్వకు మరింత కోపం తెప్పించిందని పోలీసులు తెలిపారు. ఈనేపథ్యంలోనే రోహిత్ ను చంపివేసిందని వారు తెలిపారు.