గాలి 'బెయిల్ డీల్' కేసు: యాదగిరికి బెయిల్ మంజూరు
తదుపరి విచారణ ఆరువారాలకు వాయిదా వేసింది. గతంలో ఇదే కేసులో గాలి, పట్టాభిరామారావు, సోమశేఖర్ రెడ్డి సహా ఆరుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ వ్యవహారంలో కీలక సూత్రధారి. న్యాయమూర్తి పట్టాభిరామారావుతో బెయిల్ ఇప్పించేందుకు గాను రూ. 5 కోట్లు లంచం ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సస్పెన్షన్కు గురై అరెస్టయిన న్యాయమూర్తి పట్టాభి రామారావు అంగీకరించారు. మే 11న గాలికి బెయిల్ మంజూరు కాగా ఇందులోని గుట్టును సిబిఐ రట్టు చేసింది.
ఈ బెయిల్ స్కాంలో అరెస్టయిన నిందితుల విచారణలో నాగమారుతీ శర్మ పేరు కూడా వినిపించింది. ఆయనకు కూడా ముడుపులు ఇవ్వజూపినట్లు నిందితులు తెలపడంతో దర్యాప్తు అధికారులు నాగమారుతీ శర్మ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
Comments
yadagiri gali janardhan reddy hyderabad supreme court యాదగిరి గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ సుప్రీం కోర్టు
English summary
Rowdy sheeter Yadagiri got bail in Gali Janardan Reddy bail case.
Story first published: Wednesday, September 24, 2014, 14:55 [IST]