పెళ్లి ఖర్చు రూ. 55 కోట్లు: బాహుబలి సెట్టింగ్స్
తిరువనంతపురం: కేరళకు చెందిన ఎన్నారై రవి పిళ్లై తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. కుమార్తె పెళ్లి వేడుకలు పదికాలాల పాటు అందరూ తలచుకునేలా రూ. 55 కోట్లు ఖర్చు పెడుతున్నారు.
కేవలం పెళ్లి మండపంకోసమే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టారంటే మిగతా వాటికి ఎంత రేంజ్ లో ఖర్చు చేసి ఉంటారో ఊహించుకోవచ్చు. ఈ వివాహం ఎంత రంగరంగ వైభవంగా జరుగుతుందోననే ఆసక్తితో అందరూ ఎదురు చూస్తున్నారు.
కేరళకు చెందిన రవి పిళ్లై గల్ఫ్ లో ఆర్ఫీ గ్రూప్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఈ గ్రూప్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా, గనులు, నిర్మాణ రంగాల్లో వ్యాపారం జరుగుతున్నది. ఆర్ఫీ గ్రూప్ కు ప్రపంచ వ్యాప్తంగా 26 కంపెనీలు ఉన్నాయి.
పెళ్లి ఖర్చు రూ. 55 కోట్లు
ఆ కంపెనీలలో 80 వేల మంది వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. చాల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధిపోందుతున్నారు. రవిపిళ్లైకి డాక్టర్ ఆరతీ అనే కుమార్తె ఉన్నారు. కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుతో ఆమె వివాహం నిశ్చయం అయ్యింది.
అనేక దేశాల ప్రముఖులు
నవంబర్ 26 గురువారం పెళ్లి వేడుకలు నిర్వహించడానికి సిద్దం చేశారు. ప్రపంచదేశాలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పలు బాషల సినీతారలను రవిపిళ్లై తన కుమార్తె డాక్టర్ ఆరతీ వివాహానికి ఆహ్వానించారు.
8 ఎకరాలలో సాబు సిరిల్ సెట్టింగ్స్
వివాహా వేడుకలు నిర్వహించడానికి 8 ఎకరాలలో భారీగా సెట్టింగ్స్ వేశారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబాలి చిత్రానికి సెట్స్ వేయించినా ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ తో రూ. 20 కోట్లు ఖర్చు పెట్టించి సెట్టింగ్స్ వేయించారు.
వీఐపీలకు గట్టి బందోబస్తు
ప్రపంచంలోని 40 దేశాల నుంచి వస్తున్న వీఐపీలను ఈ వివాహ వేడుకల దగ్గరకు తీసుకు వెళ్లడానికి ఇప్పటికే రెండు హెలికాప్టర్లు తిరువనంతపురం ఎయిర్ పోర్టులో సిద్దంగా పెట్టారు. వీఐపీల భద్రత కోసం 250 మంది పోలీసులు, 350 మంది ప్రయివేటు సిబ్బందిని నియమించారు.
డ్యాన్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్
ఈ వివాహ వేడుకలలో బహుబాష నటి శోభన, మళయాల చిత్ర హీరోయిన్ మంజు వారియర్ తో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్టీఫెన్ దేవన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు. ఓ పక్క వివాహ వేడుకల ఖర్చులు నియంత్రించాలని మహిళా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నది.
కేరళ చరిత్రలో
ఇదే సమయంలో ఇంత భారీ వ్యయంతో కేరళలలో ఎన్నారై రవిపిళ్లై తన కుమార్తె వివాహ వేడుకలు జరుపుతున్నారు. మొత్తం మీద ఈ పెళ్లి కేరళ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మీడియా కోడైకూస్తున్నది.