రూ.3100 కోట్లు: వలసకూలీలు, వెంటిలేటర్ల కోసం పీఎం కేర్స్ నిధులు.. వ్యాక్సిన్ కోసం కూడా..
లాక్ డౌన్ వల్ల వలసకూలీలను పట్టించుకోవడం లేదు అని, వారి సమస్యలను ఏకరువు పెట్టడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు వినిపిస్తోన్న క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వలసకూలీల కోసం రూ.3100 కోట్ల కేటాయిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
రూ.3100 కోట్లలో రూ..2 వేలు వెంటిలేటర్ల కొనుగోలు కోసం, రూ.వెయ్యి కోట్లు వసల కార్మికుల సంరక్షణ కోసం కేటాయిస్తారు. వ్యాక్సిన్ అభివృద్ది కోసం మరో రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్ సోకిన వారి ఉపయోగించే 50 వేల వెంటిలేటర్లను.. దేశంలో తయారుచేసినవే కొనుగోలు చేస్తామని పేర్కొన్నది.
Recommended Video
వలసకూలీల ఆహారం, వసతి, చికిత్స, రవాణా కోసం రూ. వెయ్యి కోట్లు అందజేస్తామని తెలిపింది. ఈ నిధులు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఉంటాయని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2011 జనాభా లెక్కల ప్రకారం పంపిణీ చేయబడుతాయని పేర్కొన్నది. దీని ప్రకారం 50 శాతం చొప్పున పంపిణీ చేస్తారని లేదంటే.. కరోనా వైరస్ కేసుల ఆధారంగా 40 శాతం చొప్పున పంపిణీ చేస్తారని పేర్కొన్నది.