వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.93.52 లక్షల కొత్త 2 వేల నోట్లు సీజ్, 7గురి అరెస్టు

జైపూర్‌లో ఐటి అధికారులు రూ.93.52 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

జైపూర్: పోలీసులు జైపూర్‌లో రూ.93.52 లక్షల విలువ చేసే 2 వేల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురిని అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 64 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ిందులో రూ.58 లక్షలు కొత్త 2 వేల నోట్లు కావడం విశేషం.

సిఐడి క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా రద్దయిన నోట్లను మార్పిడి చేయడానికి ఆ ప్రాంతంలో తిరుగాడుతున్న కారును అడ్డగించారు. మొత్తం 6 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు, అవన్నీ వంద నోట్లు అని డిసిపి (పశ్చిమం) అశోక్ గుప్తా చెప్పారు.

Currency

తాము నగదు స్వాధీనం చేసుకున్న విషయాన్ని పోలీసులు ఆదాయం పన్ను శాఖాధికారులకు సమాచారం అందించారు. ఈ విషయంపై వారు దర్యాప్తు చేస్తున్నారు.

మరో సంఘటనలో బికనూరుకు చెందిన వ్యాపారిని దోచుకున్నారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు వారి నుంచి రూ.83 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ కొత్త 2 వేల రూపాయల నోట్లు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. వారంతా వ్యాపారి రాజేష్ మిత్రులు.

వారి నుంచి 28 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రెండు, మూడు రోజుల క్రితం చోటు చేసుకుంది. వారిని కలిసి రూ. 500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి రాజేష్ రావడంతో వారు అతని వద్ద ఉన్న నగదు దోచుకున్నారు. బాధితుడు సంఘటనపై ఫిర్యాదు చేశాడు.

English summary
Police on Monday seized Rs 93.52 lakh in denomination of Rs 2,000 currency notes from seven persons, of whom three were arrested and the rest detained, in separate cases in Jaipur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X