వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేరళలో మరో హత్య: నడిరోడ్డుపై ఆరెస్సెస్ కార్యకర్తను పొడిచి, చంపేశారు
సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో వరుసగా రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యారు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.
తిరువనంతపురం: సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో వరుసగా రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యారు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.
అరెస్సెస్ కార్యకర్త అయిన ఆనంద్పై ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ దాడి జరిగింది. బైక్ పైన వెళ్తున్న అతన్ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచారు.
గురువాయుర్లోని నెన్మిని వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగులు పలుమార్లు పొడవడంతో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.
English summary
A RSS worker was hacked to death, allegedly by CPM workers at Nenmeni in the temple town this afternoon, police said. The victim, Anandan,(23), was riding a motorcycle when he was attacked by the CPM workers in a car. Though he was rushed to hospital, his life could not be saved, police said.
Story first published: Sunday, November 12, 2017, 17:19 [IST]