కేరళలో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య: ఉద్రిక్తత
కేరళలో మరో ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకర్త హత్య దారుణ హత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విపిన్ అనే వ్యక్తిని గురువారం దారుణంగా కత్తులతో పొడిచి చంపారు.
కొచ్చి: కేరళలో మరో ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకర్త హత్య దారుణ హత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విపిన్ అనే వ్యక్తిని గురువారం దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేశారు. మలప్పురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఫైజల్ పుల్లనీ అలియాస్ అనీష్ కుమార్ హత్య కేసులో విపిన్ నిందితుడిగా ఉన్నాడు. 8నెలల కిందట ఇస్లాం మతంలోకి మారాడన్న కారణంతో ఫైజల్ను దుండగులు కొట్టి చంపారు. ఈ దండగుల బృందంలో ఒకడిగా ఉన్న విపిన్ వారం రోజుల క్రితమే బెయిల్పై విడుదలయ్యాడు.
కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రత్యర్థులను కిరాతకంగా హతమారుస్తోందని ఆరెస్సెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టులోనే 34ఏళ్ల ఓ ఆరెస్సెస్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. సీపీఎం మద్దతుదారులే అతడ్ని చేతులు నరికి చంపినట్లు ఆరోపణలున్నాయి.
కేరళలో వామపక్ష ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దాదాపు 30మందికిపైగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్యకు గురయ్యారని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపిన్ హత్య జరగడంతో ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. దీంతో పోలీసులు జిల్లాలో భారీగా మోహరించారు.