వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో అజయ్ దేవ్‌గన్ సభలో ఉద్రిక్తత: లాఠీఛార్జి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఏ ఎన్నికల ర్యాలీలో హింస చోటు చేసుకుంది. నలందలోని ఎన్టీఏ నిర్వహిస్తోన్న ర్యాలీపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరుపున బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

నలంద జిల్లాలోని బిహార్‌ షరీఫ్‌ పట్టణంలో అజయ్‌ భాజపా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఉదయం పదిన్నర గంటలకు రావాల్సిన అజయ్‌ మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చారు. దాంతో అసహనానికి గురైన ప్రజలు ఆందోళనకు దిగారు. కుర్చీలను విరగొట్టి విధ్వంసానికి దిగారు.

Ruckus at BJP's rally in Bihar Sharif

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీలకు పనిచెప్పారు. అంతకు ముందు లఖిసరాయ్‌, ఖగరియాల్లోనూ అజయ్‌ సభలకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.

లాఠీ ఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. బీహార్ ఎన్నికల్లో తొలిదశలో భాగంగా సోమావరం 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 57 శాతం ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక రెండో దశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 16న జరగనుంది. నవంబర్ 8న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

English summary
Ruckus at BJP's rally in Bihar Sharif, Nalanda after Ajay Devgan failed to attend the event; lathi charge by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X