కశ్మీర్ ఎఫెక్ట్ : 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 8 నెలల గరిష్టానికి చేరిన రూపాయి విలువ
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ను విభజిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా .. నిఫ్టీ 10 వేల 800కి చేరింది. మరోవైపు రూపాయి విలువ భారీగా పడిపోయింది. 8 నెలల గరిష్టానికి రూపాయి మారక విలువ దిగజారింది. దీంతో యూరోపియన్ మార్కెట్లపై కూడా మోడీ ప్రభుత్వ నిర్ణయ వ్యతిరేక ప్రభావం చూపించింది.
ఆర్టికల్ 370, 35ఏ సెక్షన్ రద్దు చేయడంతో స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి విలువ కూడా భారీగా పడిపోయింది. అమెరికా డాలర్తో 70.60కి చేరింది. ఇదీ 8 నెలల గరిష్టానికి చేరిపోయింది. ఇదివరకు 69.60గా ఉన్న రూపాయి విలుగా మరో రూపాయి దిగజారి కనిష్టానికి చేరుకుంది. ఇదీ గత డిసెంబర్ తర్వాత ఎక్కువని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు చైనా యువాన్ కూడా డాలర్తో 7కి పడిపోయింది. ఇదీ కూడా దశాబ్దంలో మొదటిసారిని పేర్కొన్నారు. భారత స్టాక్ మార్కెట్ల ప్రభావం ఆసియా మార్కెట్లపై స్పస్టంగా కనిపించింది. మరోవైపు ఆరేళ్లలో బంగారం ధర గరిష్టానికి చేరిందని నిపుణులు చెప్తున్నారు.