వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్త ఆంక్షలు: వారికి మరింత కష్టం: బోసిపోతోన్న శబరి గిరులు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులపై అక్కడి అధికారులు ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షల నడుమ అయ్యప్పుడి దర్శనం కొనసాగుతోంది. శబరి గిరీశుడిని దర్శించడానికి రోజూ వెయ్యిమంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వారంతాపు రోజుల్లో ఈ సంఖ్యను రెండు వేల వరకు ఉంటుంది. రోజువారీ భక్తుల సంఖ్యను భారీగా పెంచాలంటూ భక్తులు ట్రావెన్‌కూర్ దేవస్వొం బోర్డు అధికారులను విజ్ఙప్తి చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో..కొత్తగా ఆంక్షలను ప్రవేశపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

Recommended Video

#SabarimalaTemple : అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్త ఆంక్షలతో బోసిపోతోన్న శబరి గిరులు...!

అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త: శబరిమల ఆలయ తలుపులు తెరచుకోనున్నాయ్..కానీ!అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త: శబరిమల ఆలయ తలుపులు తెరచుకోనున్నాయ్..కానీ!

జీవనోపాధి కోసం శబరిమల ఆలయ పరిసరాల్లో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారులపై దేవస్వొం అధికారులు కొత్తగా ఇంక్షలను విధించారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే వారిని కూడా అనుమతి ఇస్తామని ప్రకటించారు. ఇదివరకెప్పుడో చేయించుకున్న నెగెటివ్ రిపోర్టులు తీసుకుని వస్తే అనుమతించబోమని, కొత్తగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన నివేదికలను వెంట తీసుకొస్తేనే దుకాణాలను తెరవడానికి వీలు కల్పిస్తామని తేల్చి చెప్పారు.

Sabarimala 2020: After devotees, COVID19 negative report mandatory for shop keepers

కొత్తగా తీసుకోవాల్సిన, ప్రవేశపెట్టాల్సిన చర్యలపై పత్తినంథిట్ట అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అరుణ్ కే విజయన్, పోలీస్ స్పెషల్ ఆఫీసర్ బీ కృష్ణ కుమార్ సమీక్ష నిర్వహించారు. శబరిమల ఆలయం పరిసరాలతో పాటు మార్గమధ్యలో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారిని కూడా నిబంధనల పరిధిలోకి తీసుకుని రావాలని ఈ భేటీలో నిర్ణయించారు. వ్యాపారాలను నిర్వహించుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇదిలావుండగా- రోజువారీ ఆలయ ఆదాయం క్షీణించడం వల్ల భక్తులకు వసతులను కల్పించడానికి నిధుల కొరత ఏదురవుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌ను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మండలపూజ, మకరవిలక్కం సీజన్ ప్రారంభం అయిన సందర్బంగా పరిమితి సంఖ్యలో శబరిమలలోకి అయ్యప్పస్వామి భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఎకువ మంది అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు తగ్గట్లుగా తాము ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

English summary
After Lord Ayyappa pilgrims, a COVID-19 negative test report has been made mandatory for those working in temporary shops operating in Sabarimala and the temple premises now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X