వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala:కేరళలో రెడ్ అలర్ట్, బురేవి తుపాన్, అయ్యప్ప భక్తులు జాగ్రత్త, స్వామి తోడు, స్వామియేశరణమయ్యప్ప!

|
Google Oneindia TeluguNews

శబరిమల/ కొచ్చి/ పతనంపట్టి: శబరిమలకు వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులకు ఇప్పుడు బురేవి తుపాను రూపంలో మరో సమస్య ఎదరైయ్యింది. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని లెక్క చెయ్యకుండా శబరిమలకు స్వామియే శరణమయ్యప్ప అంటూ వెలుతున్న అయ్యప్ప భక్తులు రెండు రోజులు భారీ వర్షాలు పడతున్న సందర్బంగా మరోసారి కష్టాలను లెక్క చెయ్యకుండా ముందుకు వెలుతున్నారు. కేరళలో ఈనెల 2, 3వ తేదీల్లో భారీ వర్షాలు పడుతున్న సందర్బంగా ఇప్పటికే అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!

 అయ్యప్ప భక్తులకు ఆన్ లైన్ సమస్యలు

అయ్యప్ప భక్తులకు ఆన్ లైన్ సమస్యలు

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కేరళ ప్రభుత్వం అయ్యపస్వామి భక్తులకు ఇప్పటికే అనేక నియమాలు విధించింది. అతి కష్టం మీద కేరళ ప్రభుత్వం విధించిన రూల్స్ పాటిస్తూ ఆన్ లైన్ లో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అనుమతి తీసుకుంటున్న అయ్యప్ప భక్తులు శబరిమలకు వెలుతున్నారు. శబరిమలలో అయ్యపస్వామిని దర్శించుకుంటున్న అయ్యప్పస్వామి భక్తులు తరువాత మొక్కులు చెల్లించుకుని వెనుతిరుగుతున్నారు.

నివర్ కాదు మరో బురేవి తుపాను దెబ్బ

నివర్ కాదు మరో బురేవి తుపాను దెబ్బ

నివర్ తుపాను కారణంగా ఇప్పటికే అయ్యప్పస్వామి భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈనెల 2వ తేదీ, 3వ తేదీల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నివర్ తుపాను వెళ్లిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి బురేవి తుపాను రూపంలో భారీ వర్షాలు పడుతాయని తెలియడంతో అయ్యప్పస్వామి భక్తులు కొంత ఆందోళనకు గురౌతున్నారు.

కేరళలో రెడ్ అలర్ట్

కేరళలో రెడ్ అలర్ట్

కేరళలోని తిరువనంతపురం, కోల్లాం, పతనంతిట్ట, అళప్పళ జిల్లాల్లో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలో 3 సె.మీ. నుంచి 20 సె.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో 6 సె.మీ. నుంచి 11 సె.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండటంతో ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.

Recommended Video

#SabarimalaTemple: శబరిమల వెళ్లకున్నా స్వామి పూజలు , ఇరుముడుల సమర్పణకు ఏర్పాట్లు |AP Ayyappa Temples
అయ్యప్ప భక్తులు జాగ్రత్త

అయ్యప్ప భక్తులు జాగ్రత్త

రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడటంతో శబరిమలకు వచ్చి వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని శబరిమల దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు మనవి చేసింది. ఏది ఏమైనా సరే ముందుగా ఆన్ లైన్ లో డేట్ ఫిక్స్ చేసుకున్న అయ్యప్ప భక్తులు అనుకున్న సమయానికి అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని నిర్ణయించారు. అయ్యప్పస్వామి తోడుగా ఉంటే మాకు ఏమీ కాదని, శబరిమలకు వెళ్లి వస్తామని అయ్యప్ప భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Sabarimala: Several districts of Kerala may witness heavy rain due to Cyclone Burevi for next two days. Authorities asked Sabarimala pilgrims and temple authorities to be vigilant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X