Sabarimala:ఇక ఇంటికే అయ్యప్ప ప్రసాదం, కిట్లో ఇవీ కూడా.. ధర ఎంతంటే..
శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం అంటే చాలామందికి ప్రీతి. స్వామివారి ప్రసాదం స్వీకరించేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఇన్నాళ్లు శబరి వెళ్లొచ్చిన వారు మాత్రమే తీసుకొస్తే.. మిగతావారికి అందేది. కానీ ఈ సారి ప్రసాదం హోం డెలివరీ ఏర్పాటు చేశారు. ప్రసాదం కోసం భక్తులు ఆతృతగా ఎదురు చూడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రూ.450 చెల్లిస్తే చాలు ప్రసాదం ఇంటికి పంపిస్తారు. ప్రసాదంతోపాటు అరవనా, నెయ్యి, గంధపు పేస్ట్, విభూతి, కుంకుమ, పసుపు అందులో ఉంటుంది. ఈ కిట్ స్పీడ్ పోస్ట్ ద్వారా బుక్ చేసిన వారి ఇంటికి చేరుతుంది. ఈ సేవను తిరువల్లలో కేరళ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజారజన్ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పోస్టల సర్వీసెస్ డైరెక్టర్ సయ్యద్ రషీద్, ఆర్ఎంఎస్ తిరువనంతపురం డివిజనల్ సూపరింటెండెంట్ కేకే డేవిడ్ పాల్గొన్నారు.
నిలక్కల్, పంపా, సన్నిధానం వద్ద ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది క్రిమి సంహారక మందును కొట్టారు. మండల మకరవిలక్కు సందర్భంగా ఇలా చేశారు. రెస్క్యూ టీం స్పెషల్ ఆఫీసర్ ఎస్ సూరజ్, స్టేషన్ ఆఫీసర్ ఎస్ గోపకుమార్ నేతృత్వంలో 5 లోకేషన్లలో స్ప్రెడ్ చేశారు.