వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల యాత్ర నవంబర్ 16 నుండి.. వర్చువల్ క్యూ విధానం.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దర్శనాలపై ఆంక్షలు విధించారు .షిరిడి వంటి చాలా పుణ్యక్షేత్రాలలో ఇప్పటికీ భక్తులకు దర్శనాలు లేవు. ఈ క్రమంలో అయ్యప్పస్వామి మాల వేసుకుని, అత్యంత నిష్టతో పూజాధికాలు నిర్వహించి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శబరిమలకి వెళ్లి స్వామిని దర్శించుకునే అయ్యప్ప భక్తులకు ఈ సారి శబరిమల యాత్ర ఉంటుందా ? ఉండదా? అన్న ప్రశ్నలకు సమాధానం చెబుతూ కేరళ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

 శబరిమల యాత్రకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్

శబరిమల యాత్రకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్

శబరిమలకి వచ్చే భక్తులకు నవంబర్ 16వ తేదీ నుండి దర్శనాలకు అనుమతించబోతున్నట్లుగా దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. అయితే కరోనా నిబంధనలకు అనుగుణంగా,నిబంధనలు పాటిస్తూ భక్తులు యాత్ర చేయాల్సి ఉంటుందని తెలిపారు. శబరిమల యాత్ర భక్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేరళ సర్కార్ శబరికి వచ్చే భక్తులు ఖచ్చితంగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తీసుకొని వస్తేనే అనుమతిస్తామని పేర్కొన్నారు.

కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి


ఐసిఎంఆర్ గుర్తింపు ఉన్న ల్యాబ్ లలో పరీక్షలు చేయించుకుని కరోనా నెగిటివ్ వస్తేనే శబరికి రావాలని, వారితో పాటు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు కూడా తీసుకువస్తేనే అనుమతిస్తామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ స్క్రీనింగ్ చేస్తామని, వారికి కావలసిన మార్కులు శానిటైజర్ లను అందిస్తామని కరోనా వ్యాప్తి జరగకుండా దేవాదాయ శాఖ నుండి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.వర్చువల్ క్యూ విధానం ద్వారా భక్తుల సంఖ్యను పరిమితం చేస్తామని పేర్కొన్నారు. శబరిమలై కొండకు వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

 కరోనా నేపధ్యంలో శబరి యాత్ర చేసే భక్తుల కోసం ఏర్పాట్లు

కరోనా నేపధ్యంలో శబరి యాత్ర చేసే భక్తుల కోసం ఏర్పాట్లు

ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు వైద్య సేవలు అందించడం కోసం సన్నిధానం, నీలక్కల్, పంబా ప్రాంతాలలో వైద్య సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం పంబా, నీలక్కల్ మధ్య బస్సులు కూడా నడుపుతామని పేర్కొన్నారు. విపత్తుల నిర్వహణ కోసం హెలికాప్టర్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంచాలని పతనంతిట్ట కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరగా ,అందుకు అంగీకరించినట్లుగా సమాచారం.

Recommended Video

Khairtabad Ganesha : No Permission For Devotees To Visit Khairatabad Ganesha
కరోనా ప్రోటోకాల్ ప్రకారమే అయ్యప్ప దర్శనం

కరోనా ప్రోటోకాల్ ప్రకారమే అయ్యప్ప దర్శనం


దర్శనానికి భక్తులను అనుమతించినా COVID-19 ప్రోటోకాల్‌ ప్రకారం భక్తుల ప్రవేశం ఒకేసారి ఐదుగురికి మాత్రమే పరిమితం చేయబడుతుంది.మహమ్మారికి వ్యతిరేకంగా ముందుజాగ్రత్తగా ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాలలో నాలుగు నెలలకు పైగా భక్తుల దర్శనాలను నిషేధించింది.మొత్తానికి అయ్యప్ప మాల ధారుల కోసం శబరిమల యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నం కానుంది .

English summary
The Sabarimala pilgrimage will be conducted as per the COVID-19 protocol and the number of devotees will be restricted through the virtual queue system, Devaswom Minister Kadakampally Surendran has said. The annual pilgrimage season will begin on November 16. COVID-negative certificates will be mandatory for devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X