ఎంపీగా చేతలతోనే సమాధానం: గిరిజనులకు సౌకర్యాలు కల్పించిన సచిన్
ముంబై: క్రికెటర్ దిగ్గజం, రాజ్యసభసభ్యుడు సచిన్ టెండూల్కర్ తన ఎంపీ నిధులను ఆదివాసీలకు కనీస సౌకర్యాలను కల్పించేందుకు ఉపయోగించారు. ఎంపీ నిధులను ఉపయోగించడంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ తన మాటలతో కాకుండా తన చర్యలతో విమర్శకులకు సమాధానమిచ్చారు.
ముంబైకు పశ్చిమంగా ఉన్న ఆరే అనే ఆదివాసీల గూడెంలో మరుగుదొడ్ల నిర్మాణం, సోలార్లాంతర్ పంపిణీ, ఫుట్పాత్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టి ఆదివాసీలకు కనీస జీవన ప్రమాణాలను కల్పించారు. వనిచపాడ, మతాయిపాడ, ఖంబ్యచపాడ, గవ్డేవిపాడ, గితుయిచపాడ డ, ఫుక్యతలవచపాడ ప్రాంతాల్లో ఈ నిర్మాణాలను చేపట్టారు.
‘ఈ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లి ఎంతోమంది ఆదివాసీలు చిరుతపులుల దాడుల్లో మృతి చెందారు' అని వనిచపాడకు చెందిన చందు జాదవ్ అనే వ్యక్తి తెలిపారు. సచిన్ టెండూల్కర్ ఎంపి నిధులను ఉపయోగించి తమ కోసం నాణ్యమైన నిర్మాణాలను చేపట్టారని ఆయన చెప్పారు.
విద్యుత్
సౌకర్యం
లేని
ఆదీవాసీ
గూడాలకు
500
సోలార్
లాంతర్లను
పంపిణీ
చేశారు.
ఎంపి
నిధులను
సచిన్
మైదాన
ప్రాంతాల
ప్రజల
సౌకర్యాల
కోసం
కాకుండా
ఆదివాసీల
కనీస
సౌకర్యాల
కోసం
ఉపయోగించడంపై
సర్వత్రా
అభినందనలు
వెల్లువెత్తుతున్నాయి.