చంపేస్తామని...: సదానంద ఫ్యామిలీపై నటి, ట్విస్ట్లు
బెంగళూరు: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుటుంబ సభ్యులు తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని నటి మైత్రేయ ఆరోపిస్తున్నారు.
సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకున్నాడని మైత్రేయ ఇటీవల ఆరోపణలు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. కాగా, కార్తీక్ గౌడ కేసు న్యాయస్థానంలో సోమవారానికి వాయిదా పడింది.
కార్తీక్ గౌడ - మైత్రేయ
మరోవైపు, ఈ కేసుకు సంబంధించి పోలీసులు సదానంద గౌడ భార్యను విచారించారు. కార్తీక్ గౌడ తల్లి, మైత్రేయ మాట్లాడుకున్న రెండు టేపులు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ టేపులు రెండు రోజుల క్రితం మీడియాకు కూడా లీకయ్యాయి.
కార్తీక్ గౌడ - మైత్రేయ
ఈ టేపులలో... మైత్రేయ తనను తాను కార్తీక్ గౌడ తల్లికి కొద్ది నెలల క్రితం పరిచయం చేసుకున్నట్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను వచ్చి మాట్లాడాలనుకున్నట్లు మైత్రేయ చెప్పినట్లుగా ఉందని సమాచారం.
కార్తీక్ గౌడ - మైత్రేయ
తనకు ఎందుకు ఫోన్ చేశావని అడగగా.. తాను మొదట కార్తీక్కు ఫోన్ చేస్తే కలవలేదని చెప్పిందని, ఆ వెంటనే కార్తీక్ ఉంటే ఇవ్వాలని కోరిందని, అయితే, కార్తీక్ గౌడ తల్లి తాను ఇంట్లో లేనని... ఇలా టేపుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సంభాషణ రెండు నిమిషాల 22 సెకండ్లు ఉందని తెలుస్తోంది.
కార్తీక్ గౌడ - మైత్రేయ
రెండో సంభాషణ ఆరు నిమిషాల మూడు సెకండ్లు ఉంది. ఈ సంభాషణ మరుసటి రోజే జరిగినట్లుగా తెలుస్తోంది. మైత్రేయ ఉదయమే ఫోన్ చేసి.. ఆమె వచ్చిందా లేదా అని కనుగొన్నదని సమాచారం.
కార్తీక్ గౌడ - మైత్రేయ
ఈ సమయంలో కార్తీక్ గౌడ తల్లి.. అసలు నీవెవరని, ఏం కావాలని అడిగినట్లుగా సమాచారం. దీనికి మైత్రేయ స్పందిస్తూ.. తనకు కార్తీక్ గౌడ రెండు మూడు నెలలుగా తెలుసునని చెప్పినట్లుగా తెలుస్తోంది.