సద్దాం హుస్సేన్ కూతురు రగద్: “మా నాన్న అత్యుత్తమ దేశాధినేత’’- News reel
ఇరాక్ యుద్ధం ముగిసి 18 సంవత్సరాలు పూర్తయిందని, ఈ మధ్య కాలంలో తమ కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని సద్దాం హుస్సేన్ కుమార్తె రగద్ సద్ధాం హుస్సేన్ అన్నారు.
అల్- అరేబియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఇరాక్పై దాడి సమయంలో తాము కొన్నాళ్లు సిరియా, ఆ తర్వాత జోర్డాన్లలో తలదాచుకున్నామని రగద్ వెల్లడించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే నివసిస్తున్నారు.
“మూడేళ్లపాటు మా నాన్నకు అండగా ఉన్నాను. కానీ అది అంత సులభం కాదు. ఇరాక్పై దాడి తర్వాత మళ్లీ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించాం. మా నాన్న మీద మోపిన అభియోగాలపై నేను న్యాయపోరాటం చేశాను. ఆయనొక గొప్ప మనిషి. అత్యుత్తమ దేశాధినేత. అయినా తాను చాలా సామన్యుడిగానే ఉండేవారు” అని రగద్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మా నాన్న కేసు విచారణలో పాల్గొనడం అత్యంత కష్టంగా ఉండేదని రగద్ గుర్తు చేసుకున్నారు. “మా నాన్న అరెస్టయిన రోజుల్లో మేం చాలా కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు ఇరాక్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. భారీగా హింస జరుగుతోంది” అని రగద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ధోనీ వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూశారా? కడక్నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు..
- నువ్వలరేవులో పెళ్లి: వధువు వరుడి మెడలో తాళి కట్టడమే కాదు, ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలు
- కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు
- సద్దాం హుస్సేన్ ఇరాన్పై ఎందుకు దాడి చేశారు
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- 'రసాయన దాడి': సిరియా, రష్యాలను హెచ్చరించిన ట్రంప్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)