వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంటీ ఎర్రగా, సూపర్ గా ఉందని ఫ్రెండ్స్ కు తాకట్టు, ఫ్రెండ్స్ భార్యలతో అమెరికా టూర్, శాడిస్టు భర్త !

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్/ గుజరాత్: ఆంటీ భర్తకు స్నేహితుల భార్యల మీద కన్ను. స్నేహితుల భార్యలతో అంకుల్ సరసాలు ఆడుతున్నాడు. ఇదే సమయంలో ఈ వయసులో ఆంటీ ఎర్రగా హీరోయిన్ లా ఉందని అదనపు కట్నం తీసుకురావాలని టార్చర్ చేశాడు. ఇదే సమయంలో ఆంటీ భర్త ఫ్రెండ్స్ భార్యలను అమెరికాకు తీసుకెళ్లి ఎంజాయ్ చేశాడు. పుట్టింటి నుంచి డబ్బులు బంగారు నగలు ఇప్పటికే తెచ్చి నీముఖాన వేశానని, ఇంకా నేను ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇవ్వాలని భార్య ఎదురుతిరిగింది. అయితే నా స్నేహితులకు నువ్వు శారీరఖ సుఖం ఇవ్వు, నువ్వు ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది, నా కష్టాలు తీరినట్లు ఉంటుంది అంటూ ఆంటీని ఆమె శాడిస్టు భర్త టార్చర్ చేశాడు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి కిరాతకుడి అసలుబండారం బయటపెట్టింది.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 43 ఏళ్ల ఆంటీ కాపురం

43 ఏళ్ల ఆంటీ కాపురం

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో స్వప్నరాజ్ ( 43), ప్రతాప్ సింహ (47) దంపతులు (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నారు. 2002వ సంవత్సరంలో స్వప్నరాజ్, ప్రతాప్ సింహాల పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో స్వప్నరాజ్ కుటుంబ సభ్యులు కట్నం కింద 50 తులాల బంగారం, భారీ మొత్తంలో డబ్బులు, కారు ప్రతాప్ సింహాకు ఇచ్చారు.

 ఎంబీఏ చేశాడంటూ సినిమా స్టోరి

ఎంబీఏ చేశాడంటూ సినిమా స్టోరి

పెళ్లి సమయంలో ప్రతాప్ సింహా ఎంబీఏ పూర్తి చేశాడని, వ్యాపారాలు చేస్తున్నాడని స్వప్నరాజ్ కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పారు. ప్రతాప్ సింహా బాగా చదువుకున్నాడని నమ్మించి స్వప్నరాజ్ తో పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగిన ఆరు నెలలపాటు ప్రతాప్ సింహా భార్య స్వప్నరాజ్ తో హ్యాపీగా ఉన్నాడు. తరువాత ప్రతాప్ సింహా తన ప్రతాపం భార్య స్వప్నరాజ్ మీద చూపించడం మొదలుపెట్టాడు.

 పబ్ లు, పేకాట, ఫ్రెండ్స్ భార్యలు

పబ్ లు, పేకాట, ఫ్రెండ్స్ భార్యలు

ప్రతాప్ సింహా 2005లో అహమ్మదాబాద్ లో ట్రావెల్ ఏజెన్నీ ప్రారంభించాడు. అదే సమయంలో స్వప్నరాజ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ప్రతాప్ సింహా ప్రతిరోజు పబ్ లకు వెళ్లి పీకలదాక మద్యం సేవించడం, జూదం (పేకాట) ఆడటం, రాత్రిపూట స్నేహితుల ఇళ్లకు వెళ్లి వారి భార్యలతో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు. ఇలా సంపాధించిన మొత్తం డబ్బులు స్నేహితుల భార్యలకు, పేకాటకు, మందు తాగడానికి తగలేయడంతో ట్రావెల్ ఏజెన్సీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది.

 నా భార్య ఎర్రగా, బలంగా ఉంటుంది, కావాలా ?

నా భార్య ఎర్రగా, బలంగా ఉంటుంది, కావాలా ?

ట్రావెల్ ఏజెన్సీలో భారీగా నష్టాలు రావడంతో ప్రతాప్ సింహా పగలు పూటకూడా మద్యం సేవించడం మొదలుపెట్టాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు ఎక్కువ ఒత్తిడి చెయ్యడంతో ప్రతాప్ సింహా సతమతం అయ్యాడు. నా భార్య ఎర్రగా, బలంగా చూడటానికి హీరోయిన్ లా ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ అప్పులు ఇచ్చిన ఫ్రెండ్స్ కు ఎరవేశాడు. నిజంగానే ప్రతాప్ సింహా భార్య చూడటానికి చాలా అందంగా ఉండటంతో కొందరు కామాంధులు సరే నీ ఇష్టం అని ప్రతాప్ సింహాకు చెప్పి స్వప్నరాజ్ ను ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నించారు.

 డబ్బులు తేస్తావా ? నా ఫ్రెండ్స్ పక్కలో పడుకుంటావా

డబ్బులు తేస్తావా ? నా ఫ్రెండ్స్ పక్కలో పడుకుంటావా

రాత్రిపీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న ప్రతాప్ సింహా భార్య స్వప్నరాజ్ కు చిత్రహింసలు పెట్టాడు. మర్యాదగా పుట్టింటికి వెళ్లి రూ. 20 లక్షలు డబ్బులు, కొత్త కారు తీసుకుని వస్తావా ? లేదంటే నా ఫ్రెండ్స్ పక్కన పడుకుని వారికి పడకసుఖం ఇస్తావా ? నీ ఇష్టం, నువ్వే తేల్చుకో ? అంటూ చితకబాదుతున్నాడు. పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకురావడానికి, ప్రతాప్ సింహా ఫ్రెండ్స్ కు పడకసుఖం ఇవ్వడానికి స్వప్నరాజ్ నిరాకరించింది.

 ఫ్రెండ్స్ భార్యలతో అమెరికాలో ఎంజాయ్

ఫ్రెండ్స్ భార్యలతో అమెరికాలో ఎంజాయ్

2019లో ప్రతాప్ సింహా ఫ్రెండ్స్ భార్యలను అమెరికాకు పిలుచుకుని వెళ్లి అక్కడ వారితో జల్సాలు చేసి ఉన్న డబ్బులు మొత్తం తగలేశాడని ఆరోపణలు ఉన్నాయి. తరువాత అహమ్మదాబాద్ చేరుకున్న ప్రతాప్ సింహా డబ్బులు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చెయ్యడం, ట్రావెల్ ఏజెన్సీ మూతపడటంతో ప్రతాప్ సింహా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యి పిచ్చిపట్టినట్లు ప్రవర్తించాడు.

Recommended Video

Bhuma Akhila Priya To Start Film Production House || Oneindia Telugu
 నీదిక్కున్న చోట చెప్పుకో

నీదిక్కున్న చోట చెప్పుకో

భర్త ప్రతాప్ సింహా వేధింపులు ఎక్కువ కావడంతో సహనం కోల్పోయిన స్వప్నరాజ్ మా పుట్టింటి వాళ్లు ఇచ్చిన 50 తులాల బంగారు నగలు ఇచ్చేస్తే నేను మా పుట్టింటికి వెళ్లిపోతానని ప్రతాప్ సింహా తల్లిదండ్రులకు చెప్పింది. వారు బంగారు నగలు ఇవ్వడానికి నిరాకరించి ఇంటి నుంచి బయటకు నెట్టేసి నీకు దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పారు. స్వప్నరాజ్ కొడుకుని పిలుచుకుని నేరుగా అహమ్మదాబాద్ వెస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పింది. వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేశాడని, ఫ్రెండ్స్ తో సరసాలు ఆడాలని టార్చర్ పెట్టాడని ప్రతాప్ సింహా మీద కేసు నమోదు చేశారు. ఫ్రెండ్స్ భార్యలతో సరాలు ఆడుతూ అయిన డబ్బులు మొత్తం తగలేసిన పోటుగాడు ప్రతాప్ సింహాను విచారణ చెయ్యడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారు. తన భర్త నుంచి తనను కాపాడాలని స్వప్నరాజ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో విలపించింది.

English summary
Lockdown: A 43-year-old woman from Ahmedabad has registered a complaint at Mahila West Police Station, levelling allegations of harassment for dowry against her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X