కాషాయ నేతలు పెళ్లిల్లు చేసుకోరు... కాని... రేప్లు చేస్తారు... !
ఝార్ఖండ్లో చివరి దశ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పాటు స్థానిక పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ప్రధానితోపాటు అమిత్ షా సైతం ప్రచారం చేశారు. దీంతో పాటు యూపీ సీఎం యోగి అదిత్యానాథ్ సైతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
ఈనేపథ్యంలోనే జార్ఘండ్ ముక్తి మోర్చ చీఫ్ హేమంత్ సోరేన్ బీజేపీ నేతలను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసగించిన ఆయన కాషాయ పార్టీ నేతలు పెళ్లీలు చేసుకోరు కాని...మహిళలపై అత్యాచారాలు మాత్రం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో యూపీలో బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ ఉదంతాన్ని ప్రస్తావించారు. మరోవైపు యూపీ సీఎం కాషాయ దుస్తులు ధరించి చూస్తున్నామని అన్నారు. ఈనేపథ్యంలోనే కాషాయ దుస్తులు ధరించి పెళ్లిళ్లు చేసుకోకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడతారని అన్నారు.
మహిళలకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమైందని, నేరస్తులకు మాత్రం భద్రత కల్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి తరపున హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. దీంతో కూటమీ , బీజేపీల మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది.