సల్మాన్ ఖాన్పై కత్రినా ఘాటు వ్యాఖ్య, ఐశ్వర్య చురక
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పైన సినీ నటి, ఆయన మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్రెజిల్లోని రియోడిజెనిరియాలో జరిగే ఒలింపిక్స్కు భారత్ జట్టుకు గుడ్విల్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్ ఎంపిక అంశంపై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తన కొత్త చిత్రం 'బార్ బార్ దేఖో' షూటింగ్ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు ఈ వివాదంపై కత్రినా కైఫ్ను ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ... 'బజరంగీ భాయ్జాన్' హీరోకు వివాదాలేమి కొత్త కాదని ఘాటుగా స్పందించింది.
సల్మాన్ ఖాన్ ఎంపికపై 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం విజేత యోగేశ్వర్ దత్, మిల్కాసింగ్ వంటివారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సల్మాన్కు క్రీడల్లో పాత్ర ఏమైనా ఉందా? ఆయనను రియో ఒలింపిక్స్ గుడ్విల్ అంబాసిడర్గా ఎంపిక చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
అదే సమయంలో సల్మాన్ ఖాన్ ఎంపికను ప్రముఖ బాలీవుడ్ నటి, బిజెపి ఎంపీ హేమమాలిని సమర్థించారు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా సమర్థించారు. ఓ పేరున్న వ్యక్తి భాగస్వామ్యం తీసుకోవచ్చునని, అందులో తప్పు లేదన్నాడు. బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, ప్రీతిజింతా వల్ల ఐపీఎల్కు ఉపయోగపడిందని గుర్తు చేశారు.
ఐశ్వర్య రాయ్ కూడా సల్మాన్ ఖాన్కు మద్దతు పలికారు. ఆటలు, మ్యూజిక్ అంశాల పైన అంబాసిడర్గా ఉంటానంటూ ముందుకు వచ్చిన వారిని అభినందించాలని ఐశ్వర్య చెప్పారు. మంచి పని చేస్తున్న సల్మాన్ ఖాన్ వంటి వారిని ప్రోత్సహించాలని చెప్పారు.