వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూర లేదు.. ఉప్పుతో సరి.. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు చుక్కలు..! (VIDEO)

|
Google Oneindia TeluguNews

Recommended Video

కూర లేదు.. ఉప్పుతో సరి.. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు చుక్కలు..!

లక్నో : మధ్యాహ్న భోజన పథకం పక్కదారి పట్టిందనడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారం అందించాలనే ఉద్దేశంలో ప్రారంభించిన మిడ్ డే మీల్ పథకం కొన్ని చోట్ల అభాసుపాలవుతోంది. కొందరి కారణంగా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేలా తయారైంది పరిస్థితి.

ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరు చర్చానీయాంశంగా మారింది. పోషకాహారం ఏమో గానీ ప్రతి నిత్యం అక్కడి విద్యార్థులకు రొట్టెలతో పాటు కూరలు ఇవ్వకుండా అనుసరిస్తున్న విధానం ఆరోపణలకు తావిస్తోంది. తాజా ఆకు కూరలు, విజిటెబుల్స్, గుడ్లు, పాలు అందించి వారిశారీరక ఎదుగుదలకు తోడ్పాటు అందించాల్సింది పోయి వారి జీవితాలలో ఆడుకుంటున్న వైనం వెలుగుచూసింది.

salt served in the place of curry for mid-day meal in UP Mirzapur

<strong>అమెజాన్ అడవులు కాలిపోతున్నాయి.. ఆక్సిజన్‌పై ఆందోళన.. యాక్టర్ మహేశ్ బాబు విచారం..! (వీడియో)</strong>అమెజాన్ అడవులు కాలిపోతున్నాయి.. ఆక్సిజన్‌పై ఆందోళన.. యాక్టర్ మహేశ్ బాబు విచారం..! (వీడియో)

ఒక పూట అన్నం పెడుతూ మరో పూట రొట్టెలు ఇస్తున్నప్పటికీ.. కూరలు మాత్రం ఇవ్వడం లేదట. అంతేకాదు గుడ్లు, అరటిపండ్లు ఇలాంటి పోషకాహార పదార్థాలు కూడా అక్కడి సిబ్బంది స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది ఏ ఒక్క పూటకో జరుగుతుందని భావిస్తే పొరపాటే. గతేడాది నుంచి ఇదే తంతుగా వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న తతంగం విజువల్స్‌తో సహా సదరు యువ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రభుత్వ ఉన్నతాధికారి అనురాగ్ పటేల్ స్పందించారు. విచారణ జరిపించి పాఠశాల హెడ్ మాస్టర్‌తో పాటు గ్రామ పంచాయతీ సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

English summary
Students of a government primary school in Mirzapur district of Uttar Pradesh are being served salt and roti under the midday meal scheme. The midday meal scheme is designed to provide proper nutrition to scores of children from poor families who study in government schools across the country. A video posted on social media shows children sitting on the floor of the school corridor, eating rotis with just some salt in their plates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X