శాంసంగ్ ఇండిపెండెన్స్ డే సేల్: భారీ డిస్కౌంట్లు.. ఇంకా..
స్వాతంత్ర్య దినోతవ్సం సందర్భంగా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తన స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొనుగోళ్లపై బిగ్ డిస్కౌంట్లు, క్యాఫ్బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోతవ్సం సందర్భంగా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తన స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొనుగోళ్లపై బిగ్ డిస్కౌంట్లు, క్యాఫ్బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.
ముఖ్యంగా గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ పై ఈ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు రూ.20వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఇప్పటికీ శాంసంగ్ బెస్ట్ స్మార్ట్ఫోన్లుగా పరిగణించబడుతున్నాయి. ఈ ఫోన్లు గత ఏడాది ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్ 7 రూ .48,900, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రూ .56,900 ధరలతో విడుదలయ్యాయి.
ఇప్పుడు శాంసంగ్ ఇండిపెండెన్స్ డే సేల్ లో భాగంగా, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్పై రూ. 8వేల క్యాష్ బ్యాక్ (64 జీబీ, 128 జీబీ రెండు వేరియంట్లు). దీనితో పాటు, ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ .12,000 వరకు అదనపు క్యాష్ బ్యాక్ లభ్యం.
గెలాక్సీ ఎస్ 7 ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు రూ .4వేల క్యాష్ బ్యాక్. రూ.12వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్. అంతేకాదు ఈ స్వాతంత్ర్య దినోత్సవ అమ్మకాల్లో భాగంగా రెండు ఫోన్లపై 24 నెలల వరకు ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది.