ఆ ఫోన్లలో టన్నులకొద్దీ బంగారం, అందుకే వెనక్కి తీసుకొంటున్న శాంసంగ్
సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని వెలికితీసేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్లను తిరిగి వెనక్కి తీసుకొంటోంది ఆ కంపెనీ.
సియోల్: సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని వెలికితీసేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్లను తిరిగి వెనక్కి తీసుకొంటోంది ఆ కంపెనీ.
సాంకేతిక లోపాలతో గత ఏడాది అత్యధికంగా వార్తల్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 కంపెనీ వార్తల్లో నిలిచింది. దీంతో ఈ ఫోన్లన్నింటిని వెనక్కు తీసుకొంటున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్లను తిరిగి వెనక్కు తీసుకోనుంది. ఈ ఫోన్లను రీసైకిల్ చేయనుంది. గెలాక్సీ నోట్ 7 ఫోన్లను రీసైకిల్ చేయడం ద్వారా 157 టన్నుల బంగారం, వెండి , కోబాల్డ్, రాగి వంటి విలువైన లోహలను సేకరించనుందని తెలిపింది.
ఈ నెల చివరిలోపుగా ఈ ప్రకియను శాంసంగ్ ఆరంభించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఫోన్లోని కొన్ని ముఖ్య బాగాలను మాత్రం విడగొట్టి భద్రపర్చనున్నారు. శాంసంగ్ ఎమోఎల్ఈడీ డిస్ప్లే, మెమొరీ సెమీ కండక్టర్లు, కెమెరా మాడ్యూల్స్ను విడిగా భద్రపరుస్తోంది.
రీ సైకిల్ ప్రక్రియ మొత్తం ఎకో-ఫ్రెండ్లీ పద్దతుల్లోనే చేయనున్నట్టు తెలిసింది. కొన్ని విడి భాగాలను నోటీఎఫ్ఈ సర్వీస్ మెటీరియల్గా వినియోగించనుంది.
అయితే ఎవరికీ విక్రయించని నోట్7 ఫోన్లకు సరికొత్త టెక్నాలజీతో తీర్చిదిద్దిన 3200 ఎంఎహెచ్ బ్యాటరీని అమర్చి నోట్ ఎఫ్ఈ పేరుతో తీసుకొచ్చింది.