షాకింగ్ న్యూస్: సంజయ్ దత్కి క్యాన్సర్, మూడో స్టేజీ కావడంతో అమెరికా పయనం..?
ఇటీవల లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంజయ్ దత్ క్యాన్సర్ బారినపడ్డారు. లాంగ్ క్యాన్సర్ మూడో స్టేజీకి చేరింది. దీంతో చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు. కొద్దిరోజులు షూటింగ్కు విరామం ఇచ్చి.. ఆరోగ్యంపై దృష్టిపెడతానని పేర్కొన్నారు. లీలావతి ఆస్పత్రి నుంచి వచ్చే సమయంలో కరోనా వైరస్ లేదు కానీ.. భయంకరమైన క్యాన్సర్ వ్యాధి మాత్రం ఉంది అని నిర్దారణ అయ్యింది.
వైద్యం కోసం స్వల్ప విరామం తీసుకుంటున్నాను అని సంజయ్ దత్ ట్వీట్ చేశారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనతో ఉన్నారని.. బాధపడొద్దని అబిమానులను కోరారు. మీ ప్రేమతో తిరిగి బారత్ వస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తనను లీలావతి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది చక్కగా చూసుకున్నారని తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గతనెల 29వ తేదీన తన 61వ బర్త్ డేను సంజయ్ దత్ జరుపుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ టీంతో బర్త్ డే చేసుకోగా.. ఇంతలోనే క్యాన్సర్ వార్త వినాల్సి వచ్చింది.