మరుమూల పల్లెలో ‘సంకల్ప్ 95’ పేదలకు వైద్య పరీక్షలు, మన్కీబాత్లో నరేంద్ర మోడీ
వచ్చే దశాబ్ధం యువతదే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యువత ముఖ్య పాత్ర పోషించబోతున్నారని మన్ కీ బాత్లో భాగంగా కామెంట్ చేశారు. వ్యవస్థపై యువత అచంచల నమ్మకం కలిగి ఉందని, అలాగే సమస్యలపై అవగాహన కలిగి ఉండటం మంచి పరిణామని పేర్కొన్నారు. అలాగే వారు వివిధ అంశాలపై గందరగోళానికి గురవడం లేదని చెప్పారు. కానీ అస్థిరత్వాన్ని ఇష్టపడటం లేదని తెలిపారు.
వచ్చే దశాబ్ధంలో దేశం కేవలం వారి అభివృద్ధి కాకుండా దేశం పురోగమిస్తోందని మోడీ పేర్కొన్నారు. ఇది యువతలతో ఉన్న శక్తి, సామర్థ్యాలను బట్టి దేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ఇటీవల తాను బీహర్లో ఒక హెల్త్ సెంటర్ పరిశీలించానని గుర్తుచేశారు.
PM Modi in #MannKiBaat: Like everyone in the country, I also wanted to watch solar eclipse on December 26 but unfortunately it was not visible due to clouds in Delhi. However, we got to see beautiful pictures of solar eclipse from Kozhikode and some other parts of India. pic.twitter.com/A0qo0tcHPC
— ANI (@ANI) December 29, 2019
చంపారన్ జిల్లాలో భైరవ్గంజ్లో వేలాదిమంది ప్రజలు ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కాదని గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమం కాదని చెప్పారు. అక్కడ ఉన్న కేఆర్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు చొరవ తీసుకొని ఏర్పాటుచేసిన కార్యక్రమం అని పేర్కొన్నారు. దానికి వారు 'సంకల్ప్ 95' అని పేరు పెట్టారని చెప్పారు.
Tune in. #MannKiBaat https://t.co/UhAAqyjXn6
— PMO India (@PMOIndia) December 29, 2019
ఈ నెల 26వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడిందని, ఢిల్లీలో మేఘాలు ఏర్పడటం వల్ల తాను చూడలేకపోయానని మోడీ తెలిపారు. కానీ కోజికోడ్ సహా ఇతర ప్రాంతాల మాత్రం సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించిందన్నారు.