ఎంపీ శశికళ భర్త మీద దాడి చేసింది ఆంధ్రా గూండాలా ! (వీడియో)
చెన్నై: రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిళగం మీద దాడి చేసింది ఆంధ్రప్రదేశ్ కు చెందిన గూండాలని తమకు సమాచారం అందిందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగం చెప్పారని పోలీసులు అంటున్నారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో తాము లేఖ ఇవ్వడానికి వెళ్లామని అక్కడ ఉన్న కార్యకర్తలు తమను అడ్డుకున్నారని శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
దుమ్ము లేపిన శశికళ వర్గీయులు: మళ్లీ వస్తే మీ అంతుచూస్తాం
#WATCH: Suspended AIADMK MP Sasikala Pushpa's lawyer attacked outside party office by AIADMK workers in Chennai. pic.twitter.com/u10t63TmzX
— ANI (@ANI_news) December 28, 2016
శశికళ పుష్ప ఎవరు ? ఆమెకు అన్నాడీఎంకే పార్టీకి ఏమి సంబంధం ? ఎందుకు వచ్చారు ? మర్యాదగా వెళ్లిపోండి అంటూ తమను రక్తం వచ్చేటట్లు కొట్టారని, తన మీద దాడి చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన శశికళ నటరాజన్ వర్గీయులు అని ఎంపీ శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిళగం ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.