నా భర్తను చంపేస్తారా ? హై కోర్టులో స్టే తెస్తా: శశికళ పుష్ప చాలెంజ్
చెన్నై: తన భర్తను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టనని, చట్టపరంగా న్యాయపోరాటం చేసి నిందితులను కఠినంగా శిక్షించే వరకు నిద్రపోనని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప అన్నారు.
బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ? అని అనుమానం వస్తుందని, నడిరోడ్డు మీద ఓ న్యాయవాదితో పాటు నా భర్త లింగేశ్వర తిళగంను రక్తం వచ్చేటట్లు కొట్టారని, పోలీసులు సినిమా చూసినట్లు చూశారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
జయ మృతి: ఇంటర్వ్యూలో నోరు విప్పిన శశికళ, నిజం చెప్పేసి ?
శశికళ నటరాజన్ తన మీద పగతో తన భర్త లింగేశ్వర తిళగంను హత్య చెయ్యడానికి ప్రయత్నించారని, అడ్డుకున్న తన న్యాయవాది మీద దాడి చేశారని ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ ఏమైనా శశికళ నటరాజన్ జాగీరా ? అని ప్రశ్నించారు.
తాను అదే పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లానని, శశికళ నటరాజన్ కు పార్టీలో ఏమి అధికారం ఉందని ఇలా ప్రవర్థిస్తున్నారు అని ప్రశ్నించారు. జయలలిత మరణించిన తరువాత శశికళ నటరాజన్ అమ్మ ఆస్తులతో పాటు ఆమె పదవులు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
నమ్మక ద్రోహం ? జయలలిత, శశికళ అగ్రిమెంట్ లీక్
తాను ఇప్పటికే శశికళ మీద పోరాటం చెయ్యడానికి మద్రాసు హైకోర్టును ఆశ్రయించానని అన్నారు. ఇప్పుడు తన భర్త, తన న్యాయవాది మీద హత్యాయత్నం చేశారని, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరగకుండా స్టే తీసుకువచ్చి వీరికి తగిన బుద్ది చెబుతానని రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప చెప్పారు.