జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా సత్యపాల్ మాలిక్...
ప్రస్తుతం జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్గా కొనసాగుతున్న సత్యపాల్ మాలిక్నే తిరిగి కేంద్ర పాలిత ప్రాంతంగా మారనున్న జమ్ము అండ్ కశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జమ్ము కశ్మీర్తో రాష్ట్రాన్ని, జమ్ము ,కశ్మీర్ మరియు లద్దాక్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే.. దీంతో ఈ నెల 31 తర్వాత అవి మనుగడలోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీతో కూడిన కశ్మీర్ రాష్ట్రానికి సత్యపాల్ మాలిక్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా నయమించేందుకు కేంద్రంగా అడుగులు వేస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ ప్రాంతలో నెల కొన్న పరిస్తులను సత్యపాల్ మాలిక్ పర్యవేక్షణలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరకుండా కొనసాగుతోంది. ముఖ్యంగా అక్కడి ప్రాంతాలు గవర్నర్కు తెలిసినంతగా ఇతరులకు తెలిసే అవకాశం లేదని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా రానున్న కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుండడంతో తిరిగి సత్యపాల్ మాలిక్ను లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ సత్యపాల్ మాలిక్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైతే తిరిగి ఆక్టోబర్ 31 తర్వాత మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్రం మొత్తం పూర్తిగా లెప్టినెంట్ గవర్నర్ చేతిలోకి వెళ్లనుంది. అయితే ఎన్నికలు నిర్వహించిన తర్వాత పోలీసుల ఇతర భద్రతా వ్వవహారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉండగా మిగతా సాధరణ పరిపాలన మాత్రం ప్రభుత్వం చేతుల్లో కొనసాగనుంది.