భారత్తో అనుబంధం మా డీఎన్ఏలోనే ఉంది: సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్
ఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం రాత్రి భారత్కు చేరుకున్న సల్మాన్కు పాలెం విమానాశ్రయంలో ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. భారత్కు రాకమునుపు సల్మాన్ ఇస్లామాబాద్ పర్యటనకు వెళ్లారు. అయితే నేరుగా అక్కడి నుంచి భారత్కు ఆదివారమే రావాల్సి ఉండగా భారత్ కొన్ని దౌత్యపరమైన అడ్డంకులు చెప్పడంతో ఆయన తిరిగి సౌదీకి చేరుకున్నారు. అనంతరం మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు.
ఇక బుధవారం ఉదయం సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. అక్కడ ఆయనక గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. మోడీ సౌదీ రాజుతో హైదరాబాద్ హౌజ్లో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ప్రేమవిందును ప్రధాని ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా మహ్మద్ బిన్ సల్మాన్తో చర్చలు జరుపుతారు.
రాష్ట్రపతి భవన్లో గార్డ్ ఆఫ్ హానర్ పొందిన తర్వాత సౌదీరాజు మహ్మద్ బిన్ సల్మాన్... తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య బంధం తమ డీఎన్ఏలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇరుదేశాల అభివృద్ధి కోసం భారత్ సౌదీల మధ్య బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇరుదేశాల మధ్య ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చనే నమ్మకం తనకుందని చెప్పారు సల్మాన్.
ఇదిలా ఉంటే సౌదీ రాజు సల్మాన్ పర్యటనను పుల్వామా ఉగ్రదాడుల ఘటనతో చూడరాదని భారత్లో సౌదీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్ తెలిపారు. భారత్ సౌదీ అరేబియా దేశాల మధ్య బంధం ఇప్పటిది కాదని.. మున్ముందు కూడా మంచి సంబంధాలు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్ మరియు ఆర్థిక అంశాలపై ఇరు దేశాలకు మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.