నాథురాం గాడ్సే-సావర్కార్ స్వలింగ సంపర్కులు, బ్రహ్మచర్యం కన్నా ముందు అదే పని..
హిందు మహాసభ సహా వ్యవస్థాపకులు వినాయక్ దామోదర్ సావర్కర్-నాథురాం గాడ్సే మధ్య ఆ బంధం ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుక్లెట్లో పేర్కొన్నది. భోపాల్లో అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణా శిబిరంలో గురువారం బుక్లెట్ను ఆవిష్కరించింది. సావర్కర్-గాడ్సే ఇద్దరు స్వలింగ సంపర్కులని పేర్కొని సంచలనం సృష్టించింది. దీనిపై ఆరెస్సెస్, హిందు సంస్థలు స్పందించాల్సి ఉంది.
మహ్మాత్మా గాంధీని హతమార్చింది నాథురాం గాడ్సే అని తెలిసిందే. భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందని కూడా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ బుక్లెట్లో పేర్కొన్నది. నాథురాం గాడ్సే బ్రహ్మచర్యం పొందకముందు సావర్కార్తో సంపర్కం చేసుకునేవారనే ప్రస్తావించింది. ఇందులో ఆరెస్సెస్, వీర్ సావర్కర్కు సంబంధించి కొన్ని ప్రశ్నలను కూడా సంధించింది.
హిందువులు మైనారిటీలు అయిన ముస్లింలపై లైంగికదాడి చేయడాన్ని సావర్కర్ ప్రోత్సహిస్తారా అని ప్రశ్న ఇచ్చి.. బుక్లెట్లో ఔను అని సమాధానం పెట్టింది. అంతేకాదు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే సావర్కర్ మసీదుపై రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నది. ఆరెస్సెస్ అనేది హిట్లర్ నాజీ నుంచి ముస్సొలినీ ఫాసిజం నుంచి ఆవిర్భవించిందని మండిపడింది. ఆరెస్సెస్ నేతల ఒంటెద్దు పోకడలతోనే కొత్త చట్టాలు తీసుకొస్తున్నారనే విధంగా విమర్శలు గుప్పించింది.