శుభవార్త: రూ.30 లక్షలలోపు గృహరుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ
ఎస్ బి ఐ గృహరుణాలపై వడ్డీరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. రూ. 30 లక్షలలోపుగా ఉన్న లోన్లపై 25 బేసిక్ పాయింట్ల వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు సోమవారం నాడు ఎస్ బి ఐ ప్రకటించింది.
ముంబై: ఎస్ బి ఐ గృహరుణాలపై వడ్డీరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. రూ. 30 లక్షలలోపుగా ఉన్న లోన్లపై 25 బేసిక్ పాయింట్ల వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు సోమవారం నాడు ఎస్ బి ఐ ప్రకటించింది.
గృహరుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు మంగళవారం నుండి (మే 9వ,తేది) నుండి అమల్లోకి రానున్నట్టు ఎస్ బి ఐ ప్రకటించింది. ప్రస్తుతమున్న వడ్డీరేటు 8.6 శాతం నుండి 8.35 శాతంగా ఉండనుంది. అలాగే ప్రధానమంత్రి అవాస్ యోజన (అర్భన్) పథకం కింద రుణం తీసుకొనే ఖాతాదారులు కనీసం రూ.2.67 లక్షలు సబ్సీడీ పొందే అవకాశం ఉంది.
ఈ పథకం కింద మద్య ఆదాయ వర్గాలవారు మొదటిసారి గృహరుణ గ్రహీతలు ఈ తగ్గింపును పొందే అవకాశం ఉంది. తమ రేట్లు తగ్గింపుతో గృహకొనుగోలుదారులకు సరసమైన ధరలో గృహాలు స్వంతం చేసుకొవాలనుకొనేవారు మిలియన్ల మంది కల నెరవేరనుంది.
మరోవైపు ఈ ప్రభావం మార్కెట్ లో షేర్ ధరపై చూపనుంది. ఇంట్రాడేలో రూ. 300 మార్క్ , మరోసారి టచ్ చేసిన ఎస్ బి ఐ అనంతరం రూ.249 పతనమైంది. మళ్ళీ కోలుకొని దాదాపుగా 2 శాతం లాభాలతో కొనసాగుతోంది.