బ్లాక్: ఎస్ బీఐలో రూ. 53,000 కోట్లు డిపాజిట్
న్యూఢిల్లీ: భారతదేశంలో బ్యాంకింగ్ రంగలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) లో ఒక్క రోజులో ఎంత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ అయ్యిందో తెలిస్తే షాక్ గురి అవ్యడం గ్యారెంటి.
ఒక్క రోజులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అక్షరాల రూ. 53,000 కోట్లు డిపాజిట్ చేశారు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మోడీ ప్రకటన తరువాత నల్లధనం దాచి పెట్టుకున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అంతే ఇంటిలో ఉన్న డబ్బు తీసుకుని పోలో అంటు బ్యాంకుల వైపు పరుగు తీశారు. ఇలా ఒక్క స్టేట్ బ్యాంకులోనే రూ. 53,000 కోట్ల డబ్బు డిపాజిట్ అయ్యింది.
శుక్రవారం దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్ బీఐకి చెందిన అన్ని బ్రాంచ్ ల్లో ఇంత మొత్తంలో నగదు డిపాజిట్ అయ్యిందని ఎస్ బీఐ అధికారులు ప్రకటించారు. తమ బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకున్న వారు తిరిగి ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ కావడంతో అధికారులు షాక్ కు గురైనారు. గురువారం పెద్ద మొత్తంలో నదు డ్రా చేసుకుని వెళ్లిన వారు దాదాపు 3.7 % నగదు తిరిగి డిపాజిట్ చేశారని ఎస్ బీఐ అధికారులు తెలిపారు.