అవి వద్దు: గూగుల్, మైక్రోసాఫ్ట్కు సుప్రీం, ఏపీకి తమిళనాడు 200కోట్లు
న్యూఢిల్లీ: సెర్చింజన్ గూగుల్, యాహూ తదితర సైట్లలో లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ప్రకటలను ఆపాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. లింగ నిర్ధారణ పరీక్షల ప్రకటనల పైన ఓ పిల్ వేశారు.
దీని పైన విచారణ జరిపిన సుప్రీం కోర్టు గూగుల్ ఇండియా, యాహూ ఇండియా, మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ (ఐ) ప్రయివేట్ లిమిటెడ్లకు పై ఆదేశాలు జారీ చేసింది. లైంగిక నిర్ధారణ పరీక్షలు చట్టం ప్రకారం నేరం. ఈ నేపథ్యంలో అలాంటి ప్రకటనలు వద్దని ఆదేశించింది.
రూ.200 కోట్లు చెల్లిస్తాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ అయ్యారు. ప్రభుత్వానికి రూ.200 కోట్లు చెల్లింపునకు తమిళనాడు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రూ.200 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం తరఫున సీఎస్ హామీ ఇచ్చారని తెలుస్తోంది.